జాతీయ వార్తలు
తీహార్ జైలులో చిదంబరంతో ఆజాద్, అహ్మద్ పటేల్ భేటీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 19 September 2019
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 18: ఐఎన్ఎక్ మీడియా అవినీతి కేసులో తీహార్ జైలులో ఉన్న మాజీ కేంద్ర మంత్రి పీ చిదంబరాన్ని కాంగ్రెస్ సీనియర్ నేతలు అహ్మద్ పటేల్, గులాం నబీ ఆజాద్ బుధవారం ఉదయం కలిశారు. చిదంబరం కుమారుడు, కాంగ్రెస్ ఎంపీ కర్తీతో కలిసి వారు తీహార్ జైలుకు వెళ్లారు. సీనియర్ నేతలు ఇరువురూ చిదంబరంతో అర్థగంట సేపు సమావేశమయ్యారు. దేశంలో తాజా రాజకీయ పరిస్థితులు, కాశ్మీర్ అంశం, దేశ ఆర్థిక పరిస్థితి, రానున్న అసెంబ్లీ ఎన్నికలపై వారు చర్చించినట్టు తెలిసింది. చిదంబరాన్ని ఈనెల 5 జుడీషియల్ రిమాండ్ నిమిత్తం తీహార్ జైలుకు తరలించారు. తన 74వ జన్మదిన వేడుకలను చిదంబం జైలులోనే జరుపుకోవల్సిన వచ్చింది. ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని కుటుంబ సభ్యులు వెల్లడించారు.