జాతీయ వార్తలు

మిషన్ భగీరథకు నిధులు విడుదల చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 23: తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మిషన్ భగీరథ పథకానికి కేంద్ర ప్రభుత్వం రూ.20,000 కోట్ల విడుదల చేయాలని టీఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాశ్ విజ్ఞప్తి చేశారు. ఆర్థిక బిల్లుపై రాజ్యసభలో మంగళవారం జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సొంత నిధులతో చేపడుతున్న పథకాలకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాలని ఆయన కోరారు. కేంద్రానికి ఆదాయం ప్రధానంగా రాష్ట్రాల నుంచే వస్తున్నప్పటికీ మళ్లీ రాష్ట్రాలకు నిధులు ఇవ్వడం లేదని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ చేపడుతున్న మిషన్ భగీరథ ప్రాజెక్టుకు నీతి ఆయోగ్ 19,500 కోట్ల రూపాయలు ఇవ్వాలని కేంద్రానికి సిఫార్సు చేసినప్పటికీ ఇప్పటివరకు కేంద్రం ఈ ప్రాజెక్టుకు నిధులు విడుదల చేయలేదని బండ ప్రకాశ్ అన్నారు.