జాతీయ వార్తలు

అధిష్టానం ఆశీస్సులుంటే వారణాసి నుంచి పోటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాయ్‌బరేలి (యూపీ), ఏప్రిల్ 23: అధిష్టానం ఆశీస్సులుంటే వారణాసి నుంచి ప్రస్తుత ఎన్నికల్లో పోటీ చేస్తానని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా మరోసారి స్పష్టం చేశారు. వారణాసి నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మళ్లీ పోటీ చేస్తున్న నేపథ్యంలో అతనికి పోటీగా నిలబడేందుకు అధిష్టానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ఆమె మంగళవారం నాడు అన్నారు. వారణాసి లోక్‌సభ స్థానానికి మే 19న ఆఖరి విడతలో ఎన్నిక జరుగనుంది. ‘అధిష్టానం ఏమి చెబితే అది చేయడానికి నేను ఎప్పుడూ సిద్ధమేనని మరోసారి చెబుతున్నాను’ అని ప్రియాంక గాంధీ మరోసారి స్పష్టం చేశారు. ఇక్కడి ప్రజలు కూడా మార్పును కోరుకుంటున్నారని, ఇప్పటివరకు పడుతున్న ఇబ్బందులు తొలగాలని ఆశపడుతున్నారని ఆమె అన్నారు. రాయ్ బరేలి, అమేథీలో తన తల్లి సోనియా గాంధీ, సోదరుడు, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న నేపథ్యంలో వారికి మద్దతుగా ఎన్నికల ప్రచారం చేసేందుకు ఆమె ఈ రెండు ప్రాంతాల్లో మంగళవారం పర్యటించారు.