జాతీయ వార్తలు

మెహబూబా ముఫ్తీ శ్రీనగర్‌కు తరలింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు తరువాత గృహనిర్బంధంలో ఉన్న పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ అధినేత్రి ముఫ్తీ మెహబూబాను శ్రీనగర్‌లోని లాలాచౌక్‌కు తరలించారు. ఆగస్టు ఐదవ తేదీ నుంచి ఆమె గృహ నిర్బంధంలో ఉన్నారు. ఆమె ఉంటున్న గెస్ట్‌హౌస్ ప్రాంతంలో ప్రస్తుతం చలి అధికంగా ఉందని, తన తల్లి హిమోగ్లోబిన్, విటమిన్ డి, కాల్షియం స్థాయిలు తక్కువగా ఉన్నందున ఆమె శరీరం ఆ వాతావరణాన్ని తట్టుకోలేదని ముఫ్తీ కుమార్తె ఇల్తిజా ముఫ్తీ శ్రీనగర్ డిప్యూటీ పోలీసు కమిషనర్‌కు లేఖ రాశారు. దీంతో పోలీసులు ముఫ్తీ మెహబూబాను శ్రీనగర్‌లోని లాలాచౌక్‌కు తరలించారు. జమ్మూకశ్మీర్‌లో పలు పార్టీల నాయకులు గృహనిర్బంధంలో ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రులు ఫరూక్ అబ్దుల్లా, ఓమర్ అబ్దుల్లా గృహ నిర్బంధంలో ఉన్న విషయం విదితమే.