జాతీయ వార్తలు
అందుకే మోదీతో మమత భేటీ:బీజేపీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 18 September 2019
న్యూఢిల్లీ: నైరాశ్యంతో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ మోదీతో భేటీకానున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయవర్గీయ తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ శారదా కుంభకోణంలో కోల్కతా నగర పోలీసు కమిషనర్ రాజీవ్ శర్మను రక్షించేందుకు మోదీతో భేటీకానున్నారని, అందుకే ఆపాయింట్మెంట్ కోరారని ఆయన ఆరోపించారు. మమత బెనర్జీ మంత్రివర్గంలోని సగం మంది మంత్రులు శారద చిట్ఫండ్ కుంభకోణం కేసులో ఉన్నారని, రాజీవ్ కుమార్ అరెస్టయితే, ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులంతా జైలుపాలు కాక తప్పదని మమతకు తెలుసునని, అందుకే మోదీతో సమావేశం కోసం ప్రయత్నించారని చెప్పారు.