మెయన్ ఫీచర్

నిజాం స్వతంత్ర రాజ్యనేత కానే కాదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అలనాటి కేంద్ర హోమ్ మంత్రి సర్దార్ పటేల్ సైన్యాన్ని తెలంగాణకు పంపించి రాజ్యాన్ని ఆక్రమించుకున్నారని, హైదరాబాద్ సంస్థానం ఎప్పుడూ బ్రిటిష్ పాలనలో భాగం కాదని, స్వతంత్ర దేశమని, అందుకనే దేశం అంతా వచ్చిన స్వాతంత్య్రం ఈ ప్రాంతానికి వర్తించదని... అంటూ వామపక్షాలతో పాటు ముస్లిం మతోన్మాదులకు వంత పాడుతున్న రాజకీయ నేతలు, పార్టీలు, కుహనా మేధావులు తరచూ వితండ వాదం చేస్తుంటారు. అయితే, చారిత్రక వాస్తవాలు గ్రహిస్తే నిజాం ఎప్పుడూ స్వతంత్ర రాజు కాదని స్పష్టం అవుతుంది. మొదట్లో మొఘల్ రాజులకు నిజాం సుబేదార్ కాగా, ఆ తర్వాత బ్రిటిష్ పాలకులకు బానిసగా వ్యవ హరించాడని అర్థం అవుతుంది. తప్పనిసరి పరిస్థితులలో సైన్యం నుండి తిరుగుబాటు తథ్యమని గ్రహించి, దేశం వదిలి వెళ్లాల్సిన సమయంలో వెళ్తూ వెళ్తూ భారత్‌లో విభజన కుంపట్లను రేపిన బ్రిటిష్ పాలకుల బృహత్తర కుట్రను సర్దార్ పటేల్ అత్యంత ధైర్య సాహసాలు, రాజనీతి ప్రదర్శించి భగ్నం చేశారు. బ్రిటిష్ పాలకుల కుట్రలకు నిజాం వత్తాసుగా నిలిచారని గమనించాలి.
1857లో వలే సైనికులు తిరుగుబాటుకు తలబడితే తట్టుకోవడం కష్టమని గ్రహించిన బ్రిటిష్ పాలకులు దేశాన్ని రెండు ముక్కలుగా - భారత్, పాకిస్థాన్ అని విభజించారు. దేశంలో ఉన్న 500కు పైగా గల సంస్థానాలకు ఎవరికి వారుగా అధికారం చెలాయించే సౌలభ్యం కల్పించడం ద్వారా భారత్ ఒక దేశంగా మనుగడ సాగించలేని పరిస్థితులు కల్పించడానికి కుట్ర పన్నారు. ఆ కుట్రలలో భాగంగానే దేశం మధ్యలో హైదరాబాద్ కేంద్రంగా ఉన్న నిజాంతో భారత్‌లో విలీనమయ్యే ప్రసక్తి లేదని, స్వతంత్ర దేశంగా కొనసాగుతామని ప్రగల్భాలు పలికించారు. వాస్తవానికి స్వతంత్ర ఉద్యమం నాటి బ్రిటిష్ అధీనంలో ఉన్న భూభాగం అంతా సమైక్య, స్వతంత్ర దేశంగా అవతరించడం కోసం కృషి జరిగింది. ఈ సంస్థానాల్లో వేటికీ స్వయం ప్రతిపత్తి లేదు. కానీ బ్రిటిష్ ప్రభుత్వం ఆమోదించిన భారత్ స్వతంత్రం బిల్లులో పాకిస్థాన్‌ను ప్రత్యేక దేశంగా ఏర్పర్చడంతో పాటు ఇక్కడున్న సంస్థానాలు అన్నింటిని రెండు దేశాల్లో ఎక్కడ అయినా విలీనం కావడానికి లేదా స్వతంత్రంగా ఉండడానికి సౌలభ్యం కల్పించి అందరికీ విస్మయం కలిగించారు.
సంస్థానాధీశుల ఛాంబర్ చైర్మన్ ఒక పర్యాయం పామిర్ నుండి సిలోన్ వరకు, అరేబియా సముద్రం నుండి నెపాల్ వరకు ఒక విమానంపై వెళ్తోంటే వచ్చే ప్రాంతం అంతా - సుమారు 5 లక్షల చ.కి.మీ భారత దేశం అని అభివర్ణించారు. చాలావరకు ఇక్కడ సంస్థానాధీశులు ఎప్పుడూ స్వతంత్ర పాలకులుగా లేనే లేరు. 1857 తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధిపత్యాన్ని సొంతం చేసుకున్న బ్రిటిష్ పాలకులకు వీరంతా నమ్మిన బంట్లుగా ఉంటూ వచ్చారు. ఇక్కడ విదేశీ పాలన కొనసాగడానికి, స్వతంత్ర ఉద్యమాన్ని నీరు గార్చడానికి అత్యధికులు క్రియాశీలకంగా సహకరిస్తూ వచ్చారు.
హైదరాబాద్ సంస్థానంలో సైతం నిజాంలు రాజ వంశానికి చెందిన వారు గాని, స్వతంత్ర పాలకులు కాదని గ్రహించాలి. మొఘల్ రాజవంశంలో చివరి రాజయిన ఔరంగజేబు 1707లో మృతి చెందే సమయానికి వారి రాజ్యం ముక్కలు కావడం ప్రారంభమైనది. అంతకు ముందు ఛత్రపతి శివాజీ ఇచ్చిన తిరుగులేని దెబ్బ నుండి వారు కోలుకోలేదు.
ఢిల్లీలోని తురినియన్ పార్టీలో బలమైన నాయకుడైన మొహమ్మద్ అమిర్ ఖాన్ సోదరుడు, అసఫ్ జహాగా పిలువబడే చిన్ కిలిచి ఖాన్ ను 1713లో దక్కన్ ప్రాంతానికి సుబేదార్‌గా నిజాం-ఉల్-ముల్క్ (రాజ్యాన్ని నియంత్రించేవాడు) ను నియమించారు. ఉత్తరాన మాళవ నుండి దక్షిణాదిన తిరుచిరాపల్లి వరకు విస్తరించిన దక్కన్ ప్రాంతానికి ఇది కీలకమైన పదవి.
అంతలో ఢిల్లీలో మొఘల్ రాజ్యంలో కీలకులైన సయ్యద్ సోదరులు అదృశ్యం కావడంతో క్షీణ దశలో ఉన్న ఢిల్లీ వజీర్ పదవిని అసఫ్ జహాకు అప్పజెప్పారు. తెలివిగా ఆ పదవిని తిరస్కరించి దక్కన్‌కు తిరిగి వచ్చాడు. ఒక వంక ఢిల్లీ పాలకులకు అనుకూలంగా ఉంటూనే, మరోవంక ఇతరులకు సైత లొంగి ఉండేవాడు. 1766లో సలాబత్ జహా తమ్ముడైన నిజం అలీ ఖాన్ ఈస్ట్ ఇండియా కంపెనీతో అవగహనకు వచ్చి పశ్చిమాన మరాఠాల నుండి, దక్షిణాదిన హైదర్ అలీ నుండి రక్షణ కల్పించే ఏర్పాటు చేసుకున్నారు. అయినా ఈస్ట్ ఇండియా కంపెనీకి ఎక్కువకాలం అనువుగా ఉండకుండా హైదర్ అలీతో చేతులు కలిపాడు. ఇద్దరి సేనలు కలసి బ్రిటిష్ వారిపై దాడి చేశాయి. 1768 నాటికి ఆ దాడిని తిప్పికొట్టి, మచిలీపట్టణం ఒప్పందాన్ని చేసుకొని హైదరాబాద్‌లో ఒక బ్రిటిష్ రెసిడెంట్‌ను ఏర్పాటు చేసి, సైనిక స్థావరం ఏర్పాటు చేసుకున్నారు. నిజాం ఒక వంక రెసిడెంట్ తో మాములుగా ఉంటూనే వెనుక బ్రిటిష్ వారిని తొలగించడానికి మరాఠాలతో చేతులు కలిపాడు.
ఆ ప్రయత్నం వికటించడంతో నిజాం కోర్ట్‌లో బ్రిటిష్ రాజు సైనిక అధికారిని ఉంచడం ప్రారంభమైంది. దక్కన్‌లో బ్రిటిష్ ప్రాబల్యం పెరగడంతో నిజాం నిస్సహాయంగా ఉండిపోయాడు. 1878 నాటికి దేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ బలమైన సైనిక శక్తిగా ఎదగడంతో హైదరాబాద్ నుంచి ఫ్రెంచ్ సేనలను వెనుకకు పంపి, భారీ బ్రిటిష్ సైనిక బలగాలను అక్కడ ఉండేటట్లు నిజాంపై వత్తిడి తీసుకు వచ్చారు. అదే సంవత్సరం హైదర్ అలీ కుమారుడు టిప్పు సుల్తాన్ సామ్రాజ్యాన్ని కూల్చివేశారు. ఆ రాజ్యాన్ని చిన్నాభిన్నం చేసి, తమకు లొంగి ఉన్నందున కొంత భాగాన్ని నిజాంకు బహుమానంగా ఇచ్చారు. 1803 నాటికి హైదరాబాద్‌కు మరిన్ని బ్రిటిష్ సేనలు చేరుకున్నాయి. దక్షిణాదిన తమ ఆధిపత్యాన్ని నిలుపు కోవడం కోసం సికింద్రాబాద్‌ను భారీ సైనిక కేంద్రంగా చేసుకున్నారు.
1857లో దేశంలో పలు ప్రాంతాలలో బ్రిటిష్ వారిపై తిరుగుబాటు జరుగుతున్న సమయంలో హైదరా బాద్‌లోని ముస్లింలు సహితం తిరుగుబాటు చేసే ప్రయత్నం చేశారు. హైదరాబాద్ రెసిడెంట్ పై రెండుసార్లు దాడులు చేశారు. ఆ సమయంలో నిజాం చేరి ఉంటె మద్రాస్, మైసూర్, ట్రావంకోర్-కొచ్చిన్ సంస్థానాలు సహితం తిరుగుబాటు చేసి ఉండేవి. అయితే ఆ ఉపద్రవం నుండి బ్రిటిష్ పాలకులను సార్ సాలార్ జంగ్ కాపాడారు. ఆ తర్వాత 150 సంవత్సరాల పాటు బ్రిటిష్ పాలనలో ఉన్న భారత్ ప్రభుత్వంలో భాగంగానే నిజాం పాలన ఉండెడిది. నిజాంకు ఎప్పుడూ మరే దేశంతో స్వతంత్ర సంబంధాలు ఉండెడివి కావు. నిజాం పాలనలో రక్షణతో పాటు కమ్యూనికేషన్స్, రైల్వేలు, విమానాలు, పోస్టల్ వంటి కీలక అంశాలను బ్రిటిష్ పాలకులే ని ర్వహిస్తుండేవారు. నిజాంకు సొంతంగా ఆయుధాలను దిగుమతి చేయడం, ఉత్పత్తి వంటి అధికారాలు ఉండెడివి కావు. హైదరాబాద్‌లోని బ్యాంకులన్నీ బ్రిటిష్ ఇండియా బ్యాంకులకు బ్రాంచ్‌లుగా ఉండేవి.
కాగా, నిజాం పరిపాలనను లౌకికతత్వానికి ప్రతీకగా ప్రస్తుత పాలకులు తరచూ చూపే ప్రయత్నం చేస్తున్నారు. అసఫ్ జాహీ వంశ మూల పురుషుడు, హైదరాబాద్ సంస్థాపకుడు అయినా మొదటి నిజాం ఉల్ ముల్క్ తన వారసుల కోసం ఏడు సూత్రాలతో ఒక వీలునామా వ్రాసాడు. తన వారసులెవ్వరూ ఇస్లాంకు విఘాతం కల్గించే కార్యమేది తలపెట్టకూడదని చెప్పడంతో పాటు దక్షిణ దేశ బ్రాహ్మణులను ఉరి తీయడమో, జైళ్లల్లో పడవేయడమో చేయాలని కర్తవ్యోపదేశం చేశాడు. ఆయన వారసులు అదే మార్గంలో నడిచారు. నిజాం సంస్థానంలో 86 శాతం మంది హిందువులే అయినా అన్నింటా అల్పసంఖ్యాక ముస్లింలదే పెత్తనంగా ఉండెడిది. ఉన్నతస్థాయి ఉద్యో గాలలో 90 శాతంకు పైగా ముస్లింలే ఉండేవారు. నిజాం రాజ్యంలో ముస్లిం కాని వారు ముస్లిం వ్యతిరేకి అని, ముస్లిం వ్యతిరేకి అన్నవారు ప్రభుత్వ వ్యతిరేకి అని ప్రముఖ కవి కాళోజీ నారాయణరావు వ్యాఖ్యానించారు.
మొహర్రం నెల నుండి 40 రోజుల వరకు హిందువుల ఇళ్లల్లో సైతం ఏ శుభకార్యం జరపడానికి వీలుండెడిది కాదు. ఇతర రోజులలో సైతం వ్రతాలు, పెళ్లిళలు జరుపుకో వాలంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. కలెక్టర్ లేదా పోలీస్ కమిషనర్ అనుమతి లేకుండా హిందువులు కనీసం వ్యాయామశాలను ఏర్పాటు చేసుకోరాదు.

-చలసాని నరేంద్ర 98495 69050