మెయిన్ ఫీచర్

చరిత్ర సృష్టించిన మహిళా శాస్తవ్రేత్తలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యునైటెడ్ కింగ్డమ్‌లో సగానికి పైగా ప్రజలు మహిళా శాస్తవ్రేత్తల పేరును చెప్పలేకపోయారని ఒక సర్వే పేర్కొంది. యూగో సంస్థ యూకే గ్రాస్రూట్స్ గ్రూప్ సైన్స్ జిఆర్‌ఎల్‌ఎల్ తరఫున 3000 మందితో నిర్వహించిన ఒక సర్వేలో కేవలం 47 శాతం మంది మాత్రమే మహిళా శాస్తవ్రేత్తల పేరు చెప్పగలిగారు. ఈ సమయంలో అందరూ మేరీక్యూరీ పేరుని గుర్తుచేసుకున్నారు. కొంతమంది పురుష శాస్తవ్రేత్తల పేర్లు చెప్పారు. మరి మనం కూడా సైన్స్‌లో చరిత్ర సృష్టించిన ఏడుగురు మహిళా శాస్తవ్రేత్తల గురించి తెలుసుకుందాం..
మేరీక్యూరీ
రెండు నోబెల్ బహుమతులు అందుకున్న తొలి మహిళా శాస్తవ్రేత్త. రేడియో ధార్మికతపై పరిశోధన చేసినందుకు రెండు నోబెల్ బహుమతులను కైవసం చేసుకున్న తొలి మహిళ మేరీనే.. 1898 జులైలో తన భర్త పియరీ క్యూరీతో కలిసి కెమికల్ పొలోనియంని కనిపెట్టి దానికి తన సొంతదేశం పేరు పెట్టారు. అదే సంవత్సరంలో వీరు రేడియంను కనుగొన్నారు. 1903లో భౌతికశాస్త్రంలో తన భర్త పియరీ క్యూరీ, హెన్రీ బెక్కెరేల్‌తో కలిసి నోబెల్ బహుమతి అందుకున్నారు. ఎనిమిది సంవత్సరాల తర్వాత రసాయన శాస్త్రంలో నోబెల్ అందుకున్నారు. క్యూరీ పోలెండ్‌లో 1867లో జన్మించారు. చిన్నప్పటి నుంచే ఆమె పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తూ చదువుకు కావలసిన డబ్బు సమకూర్చుకునేది. భౌతిక, గణిత శాస్త్రాల్లో మాస్టర్స్ సంపాదించారు. భర్త మరణం తరువాత తొలి మహిళా ప్రొఫెసర్‌గా సోర్బోన్ విశ్వవిద్యాలయంలో పదవీ బాధ్యతలను చేపట్టారు మేరీ. సుదీర్ఘకాలంపాటు రేడియో ధార్మిక కిరణాలపై పనిచేయటం వల్ల క్యూరీ లుకేమియాతో 1934 జులై నాలుగో తేదీన మరణించారు.
పెగ్గీ విట్సన్
పెగ్గీ విట్సన్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో తొలి సైన్స్ ఆఫీసర్. పెగ్గీ హైస్కూలులో ఉండగానే నాసా తన తొలి మహిళా వ్యోమగాములను ఎంపిక చేసింది. చంద్రునిపై కాలు పెట్టాలనే పెగ్గీ కల నిజమయ్యేందుకు ఇది తోడ్పడింది. అమెరికాలోని అయోవా రాష్ట్రానికి చెందిన పెగ్గీ గ్రామీణ వ్యవసాయ కుటుంబంలో పెరిగింది. కానీ బయాలజీ, కెమిస్ట్రీ చదివి పీహెచ్‌డీ కూడా సంపాదించింది. మహిళలు అతి తక్కువగా ఉండే అంతరిక్ష రంగంలోకి అడుగుపెట్టిన పెగ్గీ.. 1996లో అంతరిక్షయానానికి ఎంపికైంది. 2002లో తన తొలి అంతర్జాతీయ అంతరిక్ష ప్రయాణంలో.. మొదటి సైన్స్ ఆఫీసర్‌గా గుర్తింపు సాధించింది. ఈ గుర్తింపును స్టార్ ట్రెక్‌కి చెందిన స్పోక్‌తో కలిసి పంచుకుంది. 3మరెక్కడా దొరకని విభిన్నమైన పరిశోధనా వాతావరణం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో లభించడంతో.. పంటల ఉత్పత్తికి, కేన్సర్ నివారణకు, ఫ్లూయిడ్ డైనమిక్స్ ఉపయోగపడతాయి2 అని పెగ్గీ చెబుతున్నారు.
మేరీ థార్ప్
సముద్రపు ఉపరితలం మ్యాప్‌లను రూపొందిస్తున్న మహిళ మేరీ థార్ప్. 1953లో అట్లాంటిక్ సముద్రపు ఉపరితలపు మ్యాప్ రూపొందించిన మేరీ థార్ప్ భూగర్భ శాస్తవ్రేత్త, సముద్ర పటాల రూపకర్త. సముద్ర అంతర్భాగంలో దాగి ఉన్న రిఫ్ట్ లోయని కనుగొని వివాదాస్పదమైన ప్లేట్ టెక్టోనిక్స్ సిద్ధాంతం నిరూపించడంలో ప్రముఖ పాత్ర పోషించారు. మొదటిసారి అందరూ థార్ప్ పరిశోధనను 3ఆడోళ్ల మాటలు2 అంటూ కొట్టిపారేశారు. పరిశోధనా నౌకల్లోకి మహిళలను అనుమతించకపోవడం కారణంగా తన సహ పరిశోధనాకారుడు బ్రూస్ హెజీన్ యాత్రల నుంచి తెచ్చిన సమాచారాన్ని ఆధారంగా చేసుకుని మ్యాప్‌లను తయారుచేయడం మొదలుపెట్టారు థార్ప్. ఇంతలా కష్టపడినప్పటికీ థార్ప్ పేరు మాత్రం వెలుగులోకి రాలేదు. ఇద్దరూ కలిసి పనిచేసినప్పటికీ హెజీన్‌కే ఎక్కువ పేరు లభించింది. మిడ్ అట్లాంటిక్ రేంజ్‌ను గుర్తించడంలో తన పాత్ర పట్ల ఆమెకు చాలా సంతృప్తి ఉంది.
వాన్దడియాజ్-మెర్సెడ్
ఖగోళ శాస్త్రాన్ని అందుబాటులోకి తెచ్చిన మహిళ డియాజ్. ఫ్యుర్టొరికోలో కాలేజీ విద్య అభ్యసిస్తున్న కాలంలో డియాజ్ తనని కబళిస్తున్న డయాబెటిక్ రెటినోపతిని గ్రహించింది. కానీ లక్ష్యాన్ని చేధించడానికి తన దృష్టి ఆటంకం కాకూడదని తీర్మానించుకుంది. డియాజ్ నాసాలో ఇంటర్న్‌షిప్ చేస్తున్నప్పుడు శబ్ద తరంగాల ద్వారా సమాచారాన్ని (డేటా సోనిఫికేషన్) అర్థం చేసుకునే విభాగంలో పనిచేసే అవకాశం లభించింది. శాటిలైట్‌ల నుంచి వచ్చే నక్షత్రాలకు సంబంధించిన సమాచారాన్ని శబ్ద తరంగాల ద్వారా అర్థం చేసుకోవడం ప్రారంభించింది. ఈ పనికి ఖగోళ శాస్తజ్ఞ్రులు సాధారణంగా గ్రాఫ్‌లను వాడుతుంటారు. ఖగోళ శాస్తజ్ఞ్రులు మరింత సమర్థవంతంగా అంతరిక్షం నుంచి వచ్చే సమాచారాన్ని అర్థం చేసుకునేందుకు డియాజ్ ఒక ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసేందుకు కృషి చేశారు. డియాజ్ ప్రస్తుతం సౌత్ ఆఫ్రికన్ ఆఫీస్ ఆఫ్ ఆస్ట్రానమీలో పనిచేస్తూ, ఖగోళ శాస్త్రాన్ని మరింతమంది అంధులకు అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నారు. 3నేను ప్రేమించే ఈ ఖగోళ శాస్త్రంలో ఎటువంటి విభజనలు ఉండకూడదు. అందరికీ సమాన అవకాశాలు ఉండాలని నేను భావిస్తా2 అని చెప్పారు డియాజ్.
ఖుర్రయిషా అబ్దుల్ కరీం
ఈవిడ ఎయిడ్స్ నిర్మూలనకు ఎంతగానో కృషి చేశారు. ఖుర్రయిషా అబ్దుల్ కరీం ఒక రోగ విజ్ఞాన పరిశోధకులురాలు. ఈమె దక్షిణాఫ్రికాలో హెచ్.ఐ.వి., ఎయిడ్స్ వ్యాప్తి, మహిళలపై దాని ప్రభావం గురించి పాతిక సంవత్సరాల పాటు పరిశోధనలు చేశారు. ఈ రంగంలో పరిశోధనలకుగాను 2013లో దక్షిణాఫ్రికా ప్రభుత్వం అత్యున్నత బిరుదు ఆర్డర్ ఆఫ్ మపుంగుబ్వేను అందుకున్నారు. హెచ్.ఐ.వి. నిర్మూలనకు ఆమె అనేక వర్గాల మహిళలతో కలిసి పనిచేశారు. ప్రస్తుతం కాప్‌రిసాలో అసోసియేట్ సైంటిఫిక్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఈమె ఐక్యరాజ్యసమితికి చెందిన వివిధ సంస్థల్లో గతంలో హెచ్.ఐ.వి. సలహాదారుగా పనిచేశారు.
సోయేన్ యి
సోయేన్ యి తొలి దక్షిణ కొరియా వ్యోమగామి. 86 వేలమందితో పోటీపడి దక్షిణ కొరియా తొలి వ్యోమగామిగా సోయేన్ యి 2008లో చరిత్ర సృష్టించారు. 3మహిళల చరిత్రలో ప్రథమ స్థానంలో నిలవడం అనుకున్నంత సులభం కాదు. ఈ విజయం మరింత మంది మహిళలు శాస్త్ర ప్రపంచంలోకి రావడానికి స్ఫూర్తిగా నిలుస్తుంది. అంతరిక్షం నుంచి ఒకసారి భూమిని చూసినప్పుడు, మన గ్రహం ఒక బహుమతిలా అనిపించింది2 అని సోయేన్ తెలిపారు.
రజా చెర్కొయ్ ఎల్ వౌర్ల్సీ
హిగ్స్ బొసన్ ఆవిష్కరణలో రజాదే కీలకపాత్ర. న్యూక్లియర్ ఫిజిసిస్ట్ రజాకి మేరీ క్యూరీ జీవిత చరిత్ర స్ఫూర్తి. మేరీక్యూరీ విజయాలతో ప్రేరేపితమైన రజా సైన్స్ చదవడానికి జీవితంలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కోవలసి వచ్చింది. 3సైన్స్ చదవడానికి ఫ్రాన్స్ వెళ్లేందుకు మా నాన్నగారిని ఒప్పించడమే నా తొలి సవాలు. మొరాకో చాలా పురాతన సంప్రదాయాలతో కూడుకున్న దేశం. సాధారణంగా అమ్మాయిలు వివాహం అయితే కానీ బయటకు వెళ్లేందుకు అనుమతి లభించదు2 అని తెలిపారు రజా. విశ్వంలో ఘనపదార్థం తయారయ్యేందుకు కారణమైన హిగ్స్‌బొసన్ పదార్థం ఉనికిని కనిపెట్టడంలో ఆమె పాత్రకుగాను అనేక అవార్డులు లభించాయి. మొరాకోలో విశ్వవిద్యాలయ స్థాయిలో మెడికల్ ఫిజిక్స్ అంశాన్ని ప్రవేశపెట్టిన ఘనత కూడా ఈమెదే..