తెలంగాణ

మృత్యువులోనూ వీడని బంధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎల్లారెడ్డిపేట, ఫిబ్రవరి 26: మూడు ముళ్ల సాక్షిగా ఒక్కటైన ఆ బంధం కడదాక తోడుగా నడిచింది. వారి జీవన‘యాత్ర’ గంటలోనే ముగిసి పోయింది. వివాహ ‘బంధం’ ఒకే చితికి చేరింది. వృద్ధ దంపతులు గండ్ర సత్తమ్మ (85) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. విషయం తెలిసిన గంటకే ఆమె భర్త గోవిందరావు (97) శ్వాస వదిలాడు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం కోరుట్లపేటలో శుక్రవారం తీవ్ర విషాదం నింపింది. స్థానికుల కథనం మేరకు.. యేడాది కిందట గోవిందరావు అనారోగ్యానికి గురయ్యారు. కొన్ని రోజులుగా అతని భార్య సత్తమ్మ అస్వస్థతకు లోనైంది. పరిస్థితి విషమంగా మారడంతో కరీంనగర్‌కు తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ చనిపోయింది. భార్య ఇక లేదని వార్త తెలిసిన గోవిందరావు కూడా కన్నుమూశాడు. తల్లిదండ్రులు ఇద్దరు మరణించడంతో కుటుంబంలో విషాదం నెలకొంది. తండ్రికి పెద్ద కొడుకు ధర్మారావు, తల్లికి చిన్న కుమారుడు వాసుదేవరావులు చితికి నిప్పు పెట్టి ఒకటిగా సాగనంపారు.