రాష్ట్రీయం

తెలంగాణకు ప్రామిసింగ్ స్టేట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయిలో జనవరి 13న స్వీకరించాలని మంత్రి కెటిఆర్‌కు ఆహ్వానం
హైదరాబాద్, డిసెంబర్ 17: తెలంగాణ రాష్ట్రాన్ని ప్రామిసింగ్ స్టేట్ ఆఫ్ ది ఇయర్ 2015గా ఎంపిక చేసిన సియన్‌బిసి నెట్‌వర్క్ 18 ప్రతినిధులు అవార్డు అందుకోవాలని ఐటి శాఖ మంత్రి కెటిఆర్‌ను ఆహ్వానించారు. ఇండియా బిజినెస్ లీడర్ అవార్డులను గత పదకొండు సంవత్సరాలుగా ఇస్తున్నామని సంస్థ తెలిపింది. ఈ సంవత్సరం తెలంగాణ రాష్ట్రాన్ని ఎంపిక చేసినట్టు చెప్పారు. ఉదయ్ కోటక్, దిలీప్ సంఘ్వీ, శిఖాశర్మలు సభ్యులుగా ఉన్న జ్యూరీ తెలంగాణకు ఈ అవార్డు ప్రకటించినట్టు చెప్పారు. అభివృద్ధితో పాటు అన్ని రంగాల్లో సమ్మిళిత దృక్పథంతో ముందుకు వెళుతూ తెలంగాణ చూపిస్తున్న నిబద్ధతకుగాను ఈ అవార్డుకు ఎంపిక చేసినట్టు చెప్పారు. జనవరి 13న ముంబయిలో జరిగే అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమానికి హాజరు కావాలని కెటిఆర్‌ను ఆహ్వానించారు.