క్రైమ్/లీగల్

బాలికను వేధించిన కేసులో నిందితునికి జైలుశిక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్ (లీగల్), మార్చి 5: ఒకే కళాశాలలో చదువుతూనే బాలిక వెంటపడి ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకోవాలని, లేనియెడల చంపుతానని బెదిరించిన కేసులో నిందితుడైన కారుపాకల రఘునాథ్ (20)కు కరీంనగర్ మొదటి అదనపు జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి శ్రీనివాస్‌లు సోమవారం సంవత్సరం జైలుశిక్ష విధించారు. ప్రాసిక్యూషన్ కథనం మేరకు..గోదావరిఖనిలోని డిగ్రీ కళాశాలలో చదువుతున్న రఘునాథ్ అదే కళాశాలలో చదువుతున్న బాలిక (17)ను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకోవాలని మానసికంగా వేదించడంతో బాలిక సంబంధిత ప్రిన్సిపాల్, లెక్చరర్ల దృష్టికి తీసుకెళ్లగా నిందితున్ని మందలించినప్పటికీ ఎలాంటి మార్పు రాలేదు. మార్చి 16, 2016న పరీక్ష జరుగుతున్నప్పుడు హాల్‌టికెట్, రూపాయలు తీసుకొని ప్రేమించకుంటే చంపుతానని బెదిరించి పరీక్ష రాయకుండా అడ్డుకున్నాడు. అనంతరం నిందితుడు కత్తితో తనకు తానే పొడుచుకొని భయబ్రాంతులకు గురి చేశాడు. దీంతో బాలిక గోదావరిఖని ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకొని కోర్టుకు పంపారు. తగిన సాక్షాధారాలను పరిశీలించిన న్యాయమూర్తి శ్రీనివాసులు నిందితునిపై నేరం రుజువు కావడంతో సంవత్సరం జైలుశిక్ష, 2500 రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు.