కృష్ణ

అభివృద్ధిని కుంటుపరుస్తున్న జగన్ సర్కార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవనిగడ్డ: వైసీపీ పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిపోయిందని, జగన్ ప్రభుత్వాన్ని ప్రతి ఒక్కరూ రద్దుల ప్రభుత్వంగా అభివర్ణిస్తున్నారని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ విమర్శించారు. బుధవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో అవనిగడ్డ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బుద్ధప్రసాద్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వమంటే మోసాలు చేసే ప్రభుత్వంగా పేరు తెచ్చుకుందన్నారు. సంక్షేమ పథకాలన్నింటినీ అటకెక్కించారన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులన్నింటినీ జగన్ ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మాజీ జడ్పీటీసీ కె వెంకటేశ్వరరావు, పార్టీ నాయకులు మండవ బాలవర్థనరావు, మత్తి శ్రీనివాసరావు, గాజుల మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.