కృష్ణ
జాతీయ త్రోబాల్ పోటీలకు మొవ్వ బాలికలు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 22 February 2019
కూచిపూడి: జాతీయ త్రోబాల్ పోటీలకు మొవ్వ జెడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన ముగ్గురు బాలికలు ఎంపికైనట్లు హెచ్ఎం ఎన్వి శ్రీ్ధర్ గురువారం తెలిపారు. ఈనెల 23వ తేదీ నుండి 26వ తేదీ వరకు హర్యాన రాష్ట్రంలోని రోహతక్లో జరగనున్న జాతీయ బాలికల త్రోబాల్ అండర్-17 విభాగంలో తమ పాఠశాలకు చెందిన బళ్ళారపు రాజరాజేశ్వరి, గూడపాటి ప్రణీత, మాగంటి శివనాగ వౌనిక పోటీల్లో పాల్గొనేందుకు తరలి వెళుతున్నట్లు ఆయన తెలిపారు. వీరికి శిక్షణ ఇచ్చిన మాదివాడ శ్రీనివాస పెరుమాళ్లు, పీఇటీ వేముల వెంకటేశ్వరరావులను విద్యాకుటుంబం అభినందించింది.