జాతీయ వార్తలు
కోల్కతా పార్క్స్ట్రీట్ అత్యాచార కేసులో దోషుల నిర్ధారణ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 10 December 2015
కోల్కతా: పశ్చిమబెంగాల్ రాజధాని కోల్కతాలో 2012లో జరిగిన పార్క్స్ట్రీట్ అత్యాచార ఘటనలో ఈరోజు న్యాయస్థానం ముగ్గుర్ని దోషులుగా నిర్ధారించింది. రేపు కోర్టు వీరికి శిక్ష ఖరారు చేయనుంది. 2012 ఫిబ్రవరి 6న పార్క్స్ట్రీట్ ప్రాంతంలో ఓ మహిళను కారులో ఎక్కించుకొని తుపాకీతో బెదిరించి అయిదుగురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. కేసులో అయిదుగురు వ్యక్తులపై ఛార్జిషీటు దాఖలైంది. కేసులో కీలక నిందితుడిని పోలీసులు ఇంకా పట్టుకోలేదు. 2015 మార్చిలో ఆమె అనారోగ్యంతో మరణించారు.