తెలంగాణ

కోదండరామ్ కాంగ్రెస్ ఏజెంట్: ఎంపీ సుమన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: గత రెండేళ్ల కాలంలో కెసిఆర్ ప్రభుత్వం చేసిందేమీ లేదని, చేతకాకుంటే ఆయన అధికారంలో నుంచి తప్పుకోవాలంటూ తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్ చేసిన వ్యాఖ్యలపై తెరాస ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు నిప్పులు చెరుగుతున్నారు. కోదండరామ్ కాంగ్రెస్ ఏజెంట్ అని తెరాస ఎంపీ బాల్క సుమన్ ఆరోపించగా, జెఎసి ఉనికి కోల్పోయిందని గనుక కోదండరామ్ దేనికి చైర్మన్‌గా ఉన్నారో ప్రజలకు చెప్పాలని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. ప్రపంచమంతా కెసిఆర్‌ను మెచ్చుకుంటుండగా ఏమీ జరగడం లేదని కోదండరామ్ అనడంలో అర్థం లేదని ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కొందరి ఒత్తిళ్లకు లొంగిపోయి కెసిఆర్ సర్కారుపై కోదండరామ్ తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని మంత్రులు తలసాని, జూపల్లి ఆరోపించారు. కెసిఆర్ అమలు చేస్తున్న పథకాలు కనిపించడం లేదా? అని మరో మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. పాలించడం అంటే పిల్లలకు పాఠాలు చెప్పడం కాదని ఆయన వ్యాఖ్యానించారు. అసత్యాలు చెబుతూ ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకు కోదండరామ్ యత్నిస్తున్నారని, నిజానికి జెఎసిని కెసిఆర్ ఏర్పాటు చేశారని ఎమ్మెల్యే శ్రీనివాసగౌడ్ అన్నారు. తెలంగాణ ప్రజలకు ఎపి సిఎం చంద్రబాబు, వైకాపా అధినేత జగన్ చేస్తున్న ద్రోహం గురించి కోదండరామ్ ఎందుకు నోరు విప్పడం లేదని మరికొందరు తెరాస నేతలు ప్రశ్నిస్తున్నారు.