జాతీయ వార్తలు

అరుణ్ జైట్లీకి ఇంటిపోరు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢిల్లీ క్రికెట్ బాగోతం బయటపెడతా
సొంత పార్టీ ఎంపి కీర్తి ఆజాద్ ధ్వజం
అమిత్ షా మధ్యవర్తిత్వం విఫలం
న్యూఢిల్లీ,డిసెంబర్ 19: కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీని టార్గెట్‌గా చేసుకుని ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్‌లో జరిగిన అవకతవకలు, అవినీతిని ఆమ్ ఆద్మీ ప్రభుత్వం బయట పెట్టటంతోఇరుకున పడిన బిజెపి నాయకత్వానికి ఇప్పుడు ఇంటిపోరు తోడుకావటంతో ఈ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. బిజెపికి చెందిన లోక్‌సభ సభ్యుడు, మాజీ క్రికెటర్ కీర్తి అజాద్ ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్‌లో జరిగిన అవినీతి అవకతవకలను సాక్ష్యాధారాలతో ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు విలేఖరుల సమావేశంలో విడుదల చేస్తానని శనివారం రాత్రి ప్రకటించారు. బిహార్‌కు చెందిన ఆజాద్ మంత్రి జైట్లీకి బద్ధ విరోధి. జైట్లీపై అజాద్ తిరుగుబాటు జెండా ఎగురవేసే అవకాశాలున్నాయని పసిగట్టిన పార్టీ అధ్యక్షుడు అమిత్ షా మీడియాతోమాట్లాడవద్దని బుజ్జగించినా ఫలితం లేకపోయిందని తెలిసింది.