జాతీయ వార్తలు
కశ్మీర్లో రక్షణమంత్రి రాజ్నాథ్ పర్యటన
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 20 July 2019
జమ్మూకశ్మీర్: జమ్మూకశ్మీర్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పర్యటించారు. పాకిస్థాన్ నియంత్రణ రేఖ వెంబడి కాల్పులకు తెగబడింది. మెషిన్గన్లు, తుపాకులతో గుళ్ల వర్షం కురిపించటంతో ప్రజలు భయంతో బంకర్లలోకి వెళ్లి తలదాచుకున్నారు. భారత సైన్యం ధీటుగా సమాధానం ఇచ్చింది. దీంతో పాకిస్థాన్ సైనికులు కాల్పులు ఆపివేశారు. కాగా రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ కార్గిల్ యుద్ధ విజయం సాధించి ఇరవై ఏళ్లు అయిన సందర్భంగా ఆయన ‘ఆపరేషన్ విజయ్’లో అమరులైన జవాన్లకు నివాళులర్పించేందుకు పర్యటిస్తున్నారు. కథువా, సాంబా జిల్లాల్లో రెండు వంతెనలు ఆయన జాతికి అంకితం చేశారు.