ఆంధ్రప్రదేశ్
కాపులను వంచిస్తున్న ముద్రగడ, జగన్! -
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 1 February 2016
హైదరాబాద్: రాజకీయ ప్రయోజనాల కోసం కాపులను రెచ్చగొట్టి వారిని మోసగిస్తున్న ముద్రగడ పద్మనాభం, వైఎస్ జగన్లకు ప్రజలే బుద్ధి చెబుతారని ఎపి టిడిపి అధ్యక్షుడు కళా వెంకట్రావు అన్నారు. ఆయన సోమవారం పార్టీ ప్రధాన కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడుతూ, సమస్యల పరిష్కారానికి కాపులు ప్రశాంతంగా ఉద్యమిస్తారని ప్రభుత్వం భావించిందే తప్ప, హింసాత్మక సంఘటనలు చోటు చేసుకుంటాయని ఊహించలేదన్నారు. కాపులకు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని తెలిపారు. ముద్రగడ,జగన్ మాత్రం శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు అరాచకశక్తులకు పురికొల్పుతున్నారని కళా ఆరోపించారు.