జాతీయ వార్తలు
జేఏన్యూ ఘటనపై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 14 January 2020
న్యూఢిల్లీ: జేఏన్యూ ఘటనపై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. దాడికి సంబంధించిన సీసీటీవీ పుటేజీలను పోలీసులకు అందజేయాలని ఆదేశించింది. అలాగే దాడికి సంబంధించిన వీడియో సందేశాలను భద్రపరచాల్సిందిగా వాట్సాప్, గూగుల్ సంస్థలను ఆదేశించింది. జేఏన్యూ దాడికి సంబంధించి కొందరు వర్శిటీ ప్రొఫెసర్లు పిటిషన్లు దాఖలు చేయగా ఈరోజు హైకోర్టు విచారణ జరిపింది. యూనిటీ ఎగెనెస్ట్ లెఫ్ట్, ఫ్రెండ్స్ ఆఫ్ ఆర్ఎస్ఎస్ వాట్సాప్ గ్రూపు సభ్యుల ఫోన్లను స్వాధీనం చేసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది.