రాష్ట్రీయం
వైకాపా ప్రభుత్వానికి సామాన్యుని కష్టాలు పట్టవా?
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 4 December 2019
తిరుపతి: మాజీ సీఎం ఇల్లు కూల్చివేతలో చూపించే శ్రద్ధ సామాన్యుడి కష్టాలు పట్టవా అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ బీజేపీతో ఇప్పిటికీ టచ్లో ఉన్నానని తెలిపారు. 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే కేటాయిస్తే కొత్త పరిశ్రమలు ఎలా వస్తాయని ప్రశ్నించారు. హోదా విషయంలో సిద్ధాంతపరమైన విభేదాల వల్ల ఆ పార్టీతో దూరంగా ఉన్నట్లు తెలిపారు. తెలుగును పరిపాలన భాషగా వాడాలని కోరారు. తెలుగు భాషను పరిరక్షించమంటే వైకాపా వక్రీకరించటం శోఛనీయమని అన్నారు. గత ఎన్నికల్లో తాను బీజేపీ, టీడీపతో కలిసి పోటీ చేసి ఉంటే వైకాపా అధికారంలోకి వచ్చేదా అని ఆయన ప్రశ్నించారు.