జనాంతికం - బుద్దా మురళి

న పురుష స్వాతంత్య్రమర్హతి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ఏం రాస్తున్నావ్!’’
‘‘పురుషుడి కష్టాల గురించి. న పురుష స్వాతంత్య్ర మర్హతి అని రాస్తున్నా’’
‘‘న పురుష కాదు బాబు న స్ర్తి అని రాయాలి’’
‘‘అది నాకు తెలుసు నేను మనువుకు లేటెస్ట్ వెర్షన్ కావాలనుకుంటున్నాను. అందుకే అలా రాస్తున్నా ’’
‘‘ఇదేమన్నా రాజకీయ పార్టీనా? కొట్టుకొచ్చి, గుంజుకొచ్చి.. కొనుక్కొచ్చి మార్చగానే నీ సొంతం కావడానికి’’
‘‘కొట్టేయడం అంత ఈజీ కాదు... కొనుక్కోవడం అంత కన్నా కష్టం. అప్పట్లో సైకిల్‌ను ఈజీగానే కొట్టేశారు. ఇప్పుడు కోట్ల రూపాయలకు రెండాకులు కొనాలని ప్రయత్నించినందుకే తమిళనాడులో దినకరన్ పోలీస్ స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరుగుతున్నాడు’’
‘‘తప్పు అలా వాదించకు. తరతరాలుగా స్ర్తికి స్వాతంత్య్రం లేకుండా చేశారు. నువ్వేమో దానికి విరుద్ధంగా పురుషుడికి స్వాతంత్య్రం లేదు అని రాయడం వాస్తవాన్ని వక్రీకరించడమే? ప్రభుత్వాలు మారగానే చరిత్ర మారిపోతుందా?’’
‘‘అని నువ్వంటావు.. చరిత్ర అంతా తప్పు అసలు పురుషుడ్నే అణిచివేశారు, అణిచివేత కొనసాగుతోందని నేనంటాను’’
‘‘అనగానే సరిపోదు, ఆధారాలు చూపాలి’’
‘‘పుట్టగానే అమ్మమ్మనో, నానమ్మనో నీకు పేరు పెడుతుంది? తప్పటడుగులు వేస్తుంటే ఓ శుభ ముహూర్తంలో నిన్ను తీసుకెళ్లి స్కూల్‌లో పడేస్తారు. గేటు దగ్గర ఆయ పెద్దరికం క్లాస్‌లోకి వెళ్లాక టీచరమ్మ పెత్తనం. యుక్తవయసు వచ్చి ఒక అమ్మ చేతిలో నిన్ను పెట్టాక భార్యామణి పెద్దరికం ఇక నీకు స్వాతంత్య్రం ఎప్పుడుంది చెప్పు ’’
‘‘నువ్వు రివర్స్‌లో చెబుతున్నావ్! స్వాతంత్య్రం లేనిది మహిళకే పెత్తనం అంతా పురుషులదే’’
‘‘అది నీ భ్రమ. నీకలా అనిపిస్తుంది. ఇందులో పెద్ద రాజకీయం ఉంది. ఆ సంగతి నీతోనే చెప్పిస్తా? ’’
‘‘ రాజకీయమేముంది?
‘‘దేశంలో, రాష్ట్రంలో అధికారంలో ఎవరున్నారు?’’
‘‘ప్రధానమంత్రి మోదీ.. తెలంగాణలో కెసిఆర్, ఆంధ్రలో చంద్రబాబు ఈ మాత్రం తెలియదా?’’
‘‘సరిగ్గా ఇప్పుడు నేను అదే చెబుతున్నాను. రికార్డులకు అచరణకు తేడా ఉంటుంది. రికార్డుల ప్రకారం న స్ర్తి స్వాతంత్య్ర మర్హతి, పురుషులదే అధికారం కానీ ఆచరణలో మాత్రం అలా కాదు’’
‘‘దానికీ... దీనికీ సంబంధమే లేదు’’
‘‘ఉంది.. కావాలంటే రాజ్యాంగాన్ని చదువు, అంత ఓపిక లేకపోతే ప్రభుత్వ ప్రకటనలు చూడు. రాష్ట్రాల్లో గవర్నర్ పేరు మీద పాలన సాగుతుంది. కేంద్రంలో రాష్టప్రతి పేరు మీద పాలన సాగుతుంది. సోనియాగాంధీ హయాంలో రాష్టప్రతి అయిన ప్రణబ్ ముఖర్జీ నా ప్రభుత్వం అని ఢిల్లీలో మాట్లాడితే, కాంగ్రెస్ హయాంలో వచ్చిన గవర్నర్ నరసింహన్ ఉభయ రాష్ట్రాల్లో, ఉభయ సభలను ఉద్దేశించి నా ప్రభుత్వం అంటూ తన ప్రభుత్వం ఎలా పాలించిందో చెబుతారు’’
‘‘అది వేరు ఇది వేరు రెండింటిని లింక్ చేయకు’’
‘‘అదీ ఇదీ ఒకటే. దేశాన్ని ఏలే రాష్టప్రతి అబద్ధం చెబుతున్నారా? గవర్నర్ అబద్ధం చెబుతున్నారా? మా ప్రభుత్వం అని స్పష్టంగా చెబుతున్నారు. అది అబద్ధం అందామా? అసలు పాలిస్తున్నది మోదీ, కెసిఆర్, చంద్రబాబు ఇది అబద్ధమా? ’’
‘‘అంటే?’’
‘‘ఏమీ లేదు. పురుషుడిది పేరుకే పెత్తనం. అధికారం అంతా మహిళదే అని చెప్పదలుచుకున్నాను. రాజ్యాంగంలోనే ఈ సౌకర్యం ఉన్నప్పుడు కుటుంబ రావుల ఇంట్లో ఎంత? రాష్టప్రతి పేరు మీద దేశ పాలన జరుగుతుంది. కానీ రాష్టప్రతిలో నిజమైన అధికారాలు ఉండవు. ప్రధానమంత్రికి ఉంటాయి. గవర్నర్ పేరు మీద రాష్ట్రాల్లో పాలన సాగుతుంది కానీ నిజమైన అధికారాలు ముఖ్యమంత్రి చేతిలో ఉంటాయి. సరిగ్గా పురుషాధిక్య సమాజం అని రాజ్యాంగబద్ధంగా పిలుచుకున్నా ఆచరణలో ప్రజాస్వామ్యంలా ఆడవారిదే పెత్తనం అని చెబుతున్నాను అంతే’’
‘‘నువ్వు చెబుతుంటే ఒకవైపు నిజమే అనిపిస్తుంది. మరోవైపు నిజం కాదు అనిపిస్తుంది’’
‘‘కళ్ల ముందు కనిపిస్తున్నా కొన్ని విషయాలను అంత ఈజీగా నమ్మలేం. మొన్న గవర్నర్ స్పీచ్ విన్నావుకదా? గవర్నర్ స్పీచ్ అధికార పక్షం రాసిచ్చినట్టుగా ఉంది అని విపక్షాలు ఆవేశంగా విమర్శించగానే ముఖ్యమంత్రి కెసిఆర్ లేచి అధికార పక్షం రాసి ఇవ్వకపోతే విపక్షం రాసిస్తుందా? బాజాప్తా మేం రాసి, క్యాబినెట్‌లో ఆమోదించి పంపించిందే గవర్నర్ చదువుతారు అని చెప్పారా? లేదా? అదే బాబు గారైతే గవర్నర్ ఉప న్యాసం వినగానే బోలెడు ఆశ్చర్యపోయి ప్రభుత్వ పనితీరుకు అద్ధం పట్టిన స్పీచ్ .. గవర్నర్ అద్భుతంగా మాట్లాడారు అంటూ నిజంగా గవర్నరే పాలిస్తున్నారు అన్నంతగా మాట్లాడేస్తారు. ఎవరి స్కూల్ వారిది.’’
‘‘ఔను విన్నాను నిజమే’’
‘‘కాలం మారింది ఇది పరేష్ రావల్‌ల కాలంలో విలన్ అంటే ఇంకెంత కాలం పాత సినిమాల్లో గుమ్మడిలా నటిస్తారు. పాలకులైనా, కుటుంబ రావులైనా ఓపెన్‌గా ఎవరిది పెత్తనమో? ఎవరి పేరు మీద ఎవరు పాలిస్తున్నారో ఓపెన్‌గా చెబితే ఎంత బాగుంటుంది. ఎన్నికల్లో ఎంత ఖర్చు చేశారో? ఎవరిని ఎన్ని పోట్లు పొడిచారో ఎంత కూడబెట్టారో నిజాయితీగా చెప్పేంతగా ప్రజాస్వామ్యం అభివృద్ధి చెందితే కనురాలా తిలకించాలనుంది. ఒక్క రూపాయి జీతంతో బతుకుతున్నాను అనడం కన్నా అధికారంలో ఉన్నప్పుడు ఇని కోట్లు సంపాదించాను అని దిగిపోయినప్పుడైనా చెబితే బాగుటుంది. నల్లధనం వెల్లడి ప్రకటన వ్యాపారులకేనా, నాయకులకు ఉండకూడదా? ’’
‘‘ఒకరి పేరు మీద ఇంకొకరి పాలన సాగడం అంటే ఒక రకంగా రాజ్యాంగంలోనే రాజ్యాంగేతర శక్తులకు అవకాశం కల్పించినట్టే... దీనికి తోడు అప్పుడప్పుడు అక్కడక్కడ రాజ్యాంగేతర శక్తులు పుట్టుకొచ్చి అధికారం చెలాయిస్తుంటాయి. దొంగ ఇంట్లో దొంగతనం చేసినట్టు.’’
‘‘ఇంతకూ ఏమంటావు’’
‘‘కాలం మారింది రాజ్యాంగాన్ని, చట్టాలను మార్చాలి. రాజ్యాధి కారం కోసం దంపతులు రాజసూయ యాగం చేసే వాళ్లు ఆ కాలంలో. ఇప్పుడు బ్రహ్మచారులు, అర్ధ బ్రహ్మచారులు, సన్యాసులకే రాజకీయాల్లో క్రేజ్ ఉంది. న పురుష స్వాతంత్య్ర మర్హతి అని తిరిగి రాయాలి. బ్రహ్మచారులకే రాజసూయ యాగం చేసే అధికారం ఉండాలి’’
*

-బుద్దా మురళి