జాతీయ వార్తలు

ఏడాది కాలంలో ఎంతో చేశాం:కశ్మీర్ గవర్నర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్మూకశ్మీర్: రాష్ట్రంలో గవర్నర్ పాలన విధించి ఏడాది కాలం అయిందని, ఈ కాలంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం కంటే తాము ఎంతో చేశామని గవర్నర్ సత్యపాల్ మాలిక్ అన్నారు. ఆయన కథువాలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ గవర్నర్ అంటే గోల్ఫ్ ఆడే వ్యక్తిగానూ, ప్రజలకు ఏమీ చేయలేని వ్యక్తిగా ముద్రపడిందని, కాని ఈ ముద్రను చెరిపేస్తూ తాము ఈ ఏడాది కాలంలో ఎంతో చేశామని చెప్పారు. కాగా జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు తరువాత ఆ రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా భారీఎత్తున బలగాలను కేంద్రం మోహరించింది. విపక్ష నేతలను గృహ నిర్బంధంలో ఉంచారు. కాగా విపక్ష నేతలకు నిర్బంధంలో ఉండగా ఎలాంటి సమస్యలు ఎదురైనా తనకు తెలియజేస్తే సౌకర్యాలు సమకూరుస్తామని చెప్పారు.