జాతీయ వార్తలు

ఉగ్రవాదులను అప్పగించి చిత్తశుద్ధిని చాటుకోండి:జైశంకర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ:్భరత్‌తో స్నేహ సంబంధాలను కోరుకుంటే అందుకు తగ్గట్టు పాకిస్థాన్ చిత్తశుద్ధితో వ్యవహరించాలని కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు. ఆయన ఫ్రెంచ్ మీడియాతో మాట్లాడుతూ..రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడాలంటే దావూద్ ఇబ్రహీం, మసూద్ అజార్ వంటి ఉగ్రవాదులను అప్పగించి తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలని అన్నారు. పాకిస్థాన్‌లో ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చే సంస్థే ఉన్నదని, ఆ సంస్థలో శిక్షణ తీసుకున్న ఉగ్రవాదులు భారత్‌పై దాడులకు తెగబడుతున్నారని తెలిపారు. ఇలా ఉగ్రవాద కార్యకలాపాలకు ఊతం ఇస్తున్న దేశంతో స్నేహ సంబంధాలు ఎలా కొనసాగించాలని ఆయన ప్రశ్నించారు.