అంతర్జాతీయం

సీసీపీఐ ర్యాంకులో టాప్ టెన్‌లో భారత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాడ్రిడ్, డిసెంబర్ 10: భారత్ తొలిసారి ఈ సంవత్సర క్లైమేట్ చేంజ్ పర్‌ఫార్మెన్స్ ఇండెక్స్ (సీసీపీఐ) ర్యాంకుల్లో టాప్ టెన్‌లో చోటు దక్కించుకుంది. ఇక్కడ జరుగుతున్న సీఓపీ25 క్లైమేట్ సమ్మిట్‌లో మంగళవారం సీసీపీఐ ర్యాంకులతో కూడిన ఒక నివేదికను మంగళవారం ప్రవేశపెట్టారు. భారత్‌లో తలసరి కర్బన ఉద్గారాలు, ఇంధన వినియోగ ప్రస్తుత స్థాయిలు ‘హై కేటగిరి’లో తొమ్మిదో స్థానంలో ఉన్నాయి. ఇవి ఇతర దేశాలతో పోల్చి చూస్తే తక్కువగా ఉన్నాయి. స్పెయిన్ రాజధాని మాడ్రిడ్‌లో జరిగిన వాతావరణ సదస్సులో ప్రవేశపెట్టిన ఈ నివేదిక భారత్ గ్రీన్ హౌస్ గ్యాస్ (జీహెచ్‌జీ) ఉద్గారాలు, ఇంధన వినియోగం విషయంలో అధిక రేటింగ్‌లో ఉందని పేర్కొంది. అయితే, భారత్ తన వాతావరణ విధానం పనితీరులో మొత్తంమీద అధిక రేటింగ్‌లో ఉన్నప్పటికీ, బొగ్గు వినియోగానికి ఇస్తున్న సబ్సిడీల తొలగింపునకు ఒక రోడ్‌మ్యాప్‌ను అభివృద్ధి చేయవలసి ఉందని నిపుణులు పేర్కొన్నారు. ఇలా చేయడం వల్ల భారత్ బొగ్గుపై ఆధారపడటం తగ్గుతుందని వారు పేర్కొన్నారు. పునరుత్పాదక ఇంధన కేటగిరిలో భారత్ మొత్తంమీద మధ్య స్థాయి రేటింగ్‌ను పొందినప్పటికీ, 2030 పునరుత్పాదక ఇంధన లక్ష్యాలలో తన రెండు డిగ్రీల సెల్సియస్‌కన్నా చాలా తక్కువ అనుగుణ్యతతో అత్యంత అధిక స్థాయి రేటింగ్‌ను సాధించిందని పేర్కొన్నారు. కర్బన ఉద్గారాలు, పునరుత్పాదక ఇంధన అభివృద్ధితో పాటు క్లైమేట్ పాలసీలో ఆస్ట్రేలియా, సౌదీ అరేబియా, ప్రత్యేకించి అమెరికాలు తక్కువ స్థాయి నుంచి అతి తక్కువ స్థాయిలో నిలవడం తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని, గ్లోబల్ క్లైమేట్ యాక్షన్ విషయంలో వ్యతిరేక ధోరణులను అనుసరిస్తున్నాయని సీసీపీఐ వెల్లడించిందని పరిశోధకులు పేర్కొన్నారు.