అంతర్జాతీయం

ఆసియా సదస్సు భగ్నానికి కుట్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్యాంకాక్, ఆగస్టు 2: బ్యాంకాక్‌లో శుక్రవారంనాడు జరిగిన ఆసియా శిఖరాగ్ర సదస్సును లక్ష్యంగా చేసుకుని బాంబు దాడులకు తెగబడిన ఇద్దరు అనుమానిత వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ శిఖరాగ్ర ప్రాంతీయ సదస్సుకు బ్యాంకాక్ ఆతిధ్యమివ్వగా, అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మైక్ పోంపియో హాజరయ్యారు. ఈ సదస్సును భగ్నం చేయడానికి లక్ష్యంగా చేసుకుని కొంతమంది తిరుగుబాటు దళానికి చెందిన వ్యక్తులు బాంబు దాడులకు దిగారు. ఈ సంఘటనలో నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడగా, సదస్సు నిర్వహణకు ఎలాంటి ఆటంకం కలుగలేదని సంబంధిత అధికార వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది మార్చిలో దేశంలో ఎన్నికలు జరిగిన తర్వాత మళ్లీ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి ప్రయుత్ చాన్-ఓ-చా ఇక్కడ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ‘ఇప్పటివరకు తొమ్మిదిసార్లు బాంబు దాడులు జరిగాయి. కానీ మా ఉద్దేశాల్లో ఎలాంటి మార్పు లేదు. శిఖరాగ్ర సదస్సును లక్ష్యంగా చేసుకుని కొంతమంది దాడులకు దిగారు. వారిలో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు’ అని పేర్కొన్నారు. పోలీస్ చీఫ్ జక్తిప్ చాయ్‌జిందా సైతం మలేషియాలోని ముస్లిం మెజారిటీ సరిహద్దు ప్రాంతం నుంచి కొంతమంది వ్యక్తులు ఇక్కడకు తరలివచ్చిన విషయాన్ని ధృవీకరించారు. పోలీసులు అరెస్టు చేసిన వ్యక్తులకు తిరుగుబాటుదారులతో ఎలాంటి సంబంధాలు ఉన్నాయన్న దానిపై విచారణ జరుపుతామని ఆయన స్పష్టం చేశారు. శుక్రవారంనాటి బాంబు దాడుల ఘటనతో ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడంతోపాటు ఆసియా శిఖరాగ్ర సదస్సును విచ్ఛిన్నం చేయడానికి చేసిన కుట్ర భగ్నమైందని ఆయన అన్నారు.