తెలంగాణ
చెరువులో మునిగి ముగ్గురు బాలురు మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 26 April 2016
హైదరాబాద్: వేసవి తాపం నుంచి ఉపశమనం పొందేందుకు చెరువులో ఈతకు వెళ్లిన ముగ్గురు బాలురు మృత్యువాత పడిన ఘటన నగర శివారు రాజేంద్రనగర్ లక్ష్మీగూడలో జరిగింది. పాషా, సమీర్, ప్రశాంత్ అనే ముగ్గురు ఇంట్లో చెప్పకుండా సోమవారం సాయంత్రం ఉందాసాగర్ చెరువు వద్దకు వెళ్లారు. రాత్రి వీరు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు మైలదేవరపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంగళవారం ఉదయం ఉందాసాగర్ చెరువులో ఈ ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. కొద్దికాలంగా ఈ చెరువులో పలువురు చిన్నారులు ఈతకు వెళుతూ మరణిస్తున్నారని గ్రామస్థులు తెలిపారు.