హైదరాబాద్

డబీర్‌పురాలో నెగ్గిన మజ్లిస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: పాతబస్తీలోని డబీర్‌పురా మున్సిపల్ వార్డుకు ఉప ఎన్నికలో మజ్లీస్ పార్టీ విజయం సాధించింది. 2016లో ఈ వార్డు నుంచి గెలుపొందిన కార్పొరేటర్ శాసన మండలి సభ్యుడిగా ఎన్నిక కావటంతో ఈ డివిజన్‌కు ఉప ఎన్నికను ఈ నెల 22న నిర్వహించారు. పోలైన మొత్తం 27.31 శాతం ఓట్లను శనివారం అంబర్‌పేటలోని ఇండోర్ స్టేడియంలో లెక్కించారు. ఇందులో మజ్లీస్ పార్టీ అభ్యర్థి మీర్జా బాసిత్ అలీ 10వేల 465 ఓట్లతో విజయం సాధించారు. ఉదయం ఎనిమిది గంటల నుంచి ప్రారంభమైన ఈ కౌంటింగ్ ఉత్కంఠ భరితంగా కొనసాగి, కేవలం రెండు గంటల వ్యవధిలోనే ఫలితం వచ్చింది. బీజేపీ అభ్యర్థి మీర్జా అఖిల్ అపంది 1226 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి మీర్ అస్గర్ అలీ బేగ్ 950, టీఆర్‌ఎస్ అభ్యర్థి రజా అలీ మీర్జాకు 620 ఓట్లు దక్కగా, టీడీపీ అభ్యర్థి మహ్మద్ అహ్మద్‌కు 147 ఓట్లు మాత్రమే దక్కాయి. ఫలితాలు ప్రకటించిన తర్వాత మజ్లీస్ శ్రేణులు విజయోత్సవాన్ని నిర్వహించారు. కౌంటింగ్ ప్రక్రియను ఎన్నికల పరిశీలకులు వీరబ్రహ్మయ్య, రిటర్నింగ్ అధికారి అనిల్‌కుమార్ ఎప్పటికపుడు పర్యవేక్షించారు.