హైదరాబాద్

‘రంధి’ నవల ఆవిష్కరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ, : ప్రముఖ రచయిత ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు పద్మశ్రీ ఆచార్య కొలకలూరి ఇనాక్ రచించిన ‘రంధి’ నవల ఆవిష్కరణ సభ శ్రీత్యాగరాయ గానసభ ఆధ్వర్యంలో శుక్రవారం గానసభలోని కళా సుబ్బారావు కళావేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు డా.నందిని సిధారెడ్డి పాల్గొని పుస్తకాన్ని ఆవిష్కరించారు. కొలకలూరి ఇనాక్ నవలలు మానవీయ కోణంలో ఉంటాయని పేర్కొన్నారు. శ్రీత్యాగరాయ గానసభ ఆధ్వర్యంలో ‘సాహితీ సప్తాహం’ వారం రోజుల పాటు నిర్వహించి సాహితీవేత్తలను ప్రొత్సహించడం అభినందనీయమని అన్నారు. గానసభ అధ్యక్షుడు కళా జనార్దన మూర్తి సభాధ్యక్షత వహించిన కార్యక్రమంలో ప్రముఖ సాహితీవేత్త డా.తెనే్నటి సుధాదేవి, కవి బీక్కీ కృష్ణ పాల్గొన్నారు.