జాతీయ వార్తలు

గొగొయ్‌కు జడ్‌ప్లస్ భద్రత కొనసాగింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: జస్టిస్ రంజన్ గొగొయ్‌కు కేంద్రం జడ్‌ప్లస్ భద్రత కొనసాగించాలని నిర్ణయించింది. ఈనెల 17న పదవీ విరమణ చేస్తున్న ఆయనకు ఇకముందు కూడా జడ్‌ప్లస్ భద్రత కొనసాగించాలని ఈ మేరకు అసోం పోలీసులకు ఆదేశాలు జారీ అయ్యాయి. సంవత్సరాల తరబడి పెండింగ్‌లో ఉన్న అయోధ్య వివాదం కేసులో తీర్పునిచ్చిన ఐదుగురు సభ్యుల ధర్మాసనానికి ఆయన అధ్యక్షత వహించిన విషయం విదితమే. జస్టిస్ గొగొయ్‌తో పాటు మిగిలిన నలుగురు న్యాయమూర్తులకు కూడా కేంద్రం అయోధ్య తీర్పు నేపథ్యంలో జడ్‌ప్లస్ కేటగిరీ భద్రత కొనసాగిస్తుంది. జస్టిస్ గొగొయ్ పదవీ విరమణ తరువాత అసోంలోని గుహవటిలో ఉండే అవకాశాలు ఉన్నందున అక్కడ పోలీసులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. దిబ్రుఘర్‌లోని ఆయన పూర్వీకుల ఇంటికి కూడా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతాఏర్పాట్లు చేశారు.