రాష్ట్రీయం

జోగులాంబను దర్శించుకున్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అలంపూర్, నవంబర్ 28: అష్టాదశ శక్తిపీఠాలలో 5వ శక్తిపీఠమైన మహబూబ్‌నగర్ జిల్లా అలంపూర్‌లోని శ్రీ జోగులాంబదేవి, బాలబ్రహ్మేశ్వరస్వామి దేవాలయాలను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దిలిప్‌బిబోస్లే, హైకోర్టు న్యాయమూర్తి రాజశేఖర్‌రెడ్డి శనివారం దర్శించుకున్నారు. ఇఓ గురురాజ, అర్చక స్వాములు, చైర్‌పర్సన్ లక్ష్మినారాయణరెడ్డి పూర్ణకుంభస్వాగతం పలికారు. వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరికి అర్చక స్వాములు తీర్థప్రసాదాలు అందజేసి శేషవస్త్రాలతో సత్కరించారు. అనంతరం అమ్మవారి ధ్వజస్థంభం వద్ద కార్తీక దీపజ్యోతిని వెలిగించారు. వీరితో పాటు మహబూబ్‌నగర్ జిల్లా జడ్జి శివనాగిరెడ్డి, జిల్లా అదనపు జడ్జి హరికృష్ణ్భూపతి, అలంపూర్ జూనియర్ సీనియర్ జడ్జి రామలింగం, న్యాయవాదులు శాంతిమల్లప్ప, నాగరాజుయాదవ్, సురేష్‌కుమార్‌శెట్టి ఉన్నారు.