జనాంతికం - బుద్దా మురళి

మాటలే.. చేతలేవీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అప్పులపాలై బక్కచిక్కి ఆత్మహత్య చేసుకునే రైతులంటే కవులకు ప్రేమ. ఆవురావురని కవితాక్షరాల పోగులు పెడతారు. ప్రభుత్వానికి ప్రేమ. బావురు బావురు మంటూ సానుభూతి ఎక్స్‌గ్రేషియా కుప్పలు పోస్తారు. ప్రతిపక్షాలకూ ప్రేమే. బోదురు బోదురని ప్రభుత్వంపై విమర్శల రాశులు పోస్తారు. అందరివీ మాటల గ్యాసే. చేతలు నిల్. స్వచ్ఛంద సంస్థలు చేయగలిగింది ఎంతో ఉంది. కాని చేయరు. ఈ సంస్థలు రైతుల వద్దకు వెళ్లి సాంత్వన కలిగించవచ్చు. భూమి పరీక్షలు జరిపించి ఏ పంటలు ఎప్పుడు వేయాలో చెప్పొచ్చు. ఒక్క దేశవాళి ఆవుతో అతి తక్కువ ఖర్చుతో 30 ఎకరాలు సాగుచేయడం నేర్పవచ్చు. భూమి దున్ని విత్తనాలు వెదజల్లి శ్రమ, ఖర్చు తగ్గించుకొని పంటలు పండించే విధం నేర్పవచ్చు. కాని ఆ సంస్థలు పట్టణాలకే పరిమితం!
- శాంతి చంద్రిక, సామర్లకోట
బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాలి
అవినీతిలో కూరుకుపోయే ప్రజాప్రతినిధులను నిలదీయడానికి చట్టాలు చేయాలని ఒక పాఠకుడు ఉత్తరాయణంలో వాపోయారు. చట్టాలు చేసేది ప్రజాప్రతినిధులే కదా. తమ కొంప కూల్చే చట్టాలు వాళ్లెందుకు చేస్తారు? నిజానికి నిలదీయడానికి చట్టాలు అక్కరలేదు. నిలదీసే హక్కు రాజ్యాంగమే ఇచ్చింది. నిలదీయకపోయినా ఎన్నికల వరకు ఓపిక పట్టి అవినీతిపరులకు ఓటు వేయకుంటే చాలు. తమాషా ఏమంటే నేరాలు చేసి జైలుపాలై బెయిల్ మీద బయటకొచ్చి ప్రజలకు నీతులు బోధించే వారిని, వారి పార్టీలను ప్రజలు మళ్లీ మళ్లీ ఎన్నుకుంటూ ఉండడం వల్లనే ఈ దుర్గతి. ప్రజల చేతిలో బ్రహ్మాస్తమ్రే ఉంది. వాళ్లు దాన్ని సక్రమంగా ఉపయోగించడం లేదంతే!
- ప్రసాద్, గొడారిగుంట
గొలుసు దొంగలు
ఉద్యోగ గండాలున్న బద్ధకస్తులు, విలాసాలకు అలవాటుపడ్డవారు, కాయకష్టం చేయకుండా ఏదో విధంగా ఈజీమని సంపాదిద్దామనుకునే మనస్తత్వం గలవారు, ముఖాలకు హెల్మెట్లు అడ్డం పెట్టుకుని దొంగిలించిన బైట్‌లపై వచ్చి, పనుల మీద వీధులలోకొచ్చిన మహిళల మెడలలోని బంగారు గొలుసులను బలవంతంగా తెంపుకెళ్ళిపోతున్నారు. దానివల్ల వస్తువులు పోవడమే గాకుండా మెడలు కోసుకుపోతున్నాయి. ఈ గొలుసు దొంగలు ఈమధ్య పట్టుబడ్డా, ఈ అరాచక కిరాతక చర్యలు మరికొంతమంది కొనసాగిస్తూనే ఉన్నారు. ప్రభుత్వం కఠిన వైఖరి అవలంబించకపోతే అర్ధరాత్రి కాదుగదా పట్టపగలే మహిళలకు ఇంటా బయటా రక్షణ లేకుండాపోతుంది.
- ఎన్.రామలక్ష్మి, సికిందరాబాద్
ఏమిటీ అపరిశుభ్రత..!
మంగళగిరి పట్టణంలోని పాత బస్‌స్టేషన్ ఆవరణలో కాలుపెట్టేందుకు వీలులేని అపరిశుభ్ర పరిస్థితులు వున్నాయి. ఇక్కడినుండి తెనాలి, విజయవాడ, అమరావతి, ఇతర గ్రామీణ ప్రాంతాలక