సంపాదకీయం

భాషల మీమాంస..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విదేశీయ భాషలు మన మాతృభాషలను దిగమింగి వేయకుండా నిరోధించడానికి వీలుగా ఒక ‘జాతీయ అనుసంధాన భాష’ను రూపొందించుకోవాలని దేశ వ్యవహారాల మంత్రి అమిత్ షా హితవు చెప్పడం విచిత్రమైన పరిణామం. ఆంగ్లం మొత్తం భారతీయ భాషల స్వరూపాన్ని ఇదివరకే దిగమింగి ఉంది, జాతీయ స్వభావాన్ని దశాబ్దుల క్రితమే చెఱచివేసింది. ఇది మొదటి వైపరీత్యం. మొత్తం దేశాన్ని పరిపాలించే కేంద్ర ప్రభుత్వానికి అధికార భాషగా హిందీని నిర్ధారించి ఏడు దశాబ్దులయింది. రాజ్యాంగంలోని మూడువందల నలబయి మూడవ అధికరణం మేరకు హిందీ అధికార భాష. దేశంలోని ఉన్నత విద్యావంతులందరికీ ఈపాటికి హిందీ భాష వచ్చి ఉండాలి. కానీ రాలేదు. ఇది రెండవ వైపరీత్యం. మొదటి వైపరీత్యానికి విరుగుడుగా ‘ఆంగ్ల భాష దిగమింగిన భారతీయ భాషలను పునరుజ్జీవింపచేసుకోవాలన్నది’ అమిత్ షా వంటి వారు ఇవ్వదగిన పిలుపు. విదేశీయ ఆంగ్ల భాషా గ్రహణగ్రస్తమై ఉన్న భారతీయ భాషలను గ్రహణముక్తం చేయడం వౌలిక అనివార్యం. క్రియా పదాలు తప్ప మిగిలిన పదజాలం ఆంగ్లమైపోయి ఉండడం తెలుగు భాషకు దాపురించిన గ్రహణం. ‘మమీ కిచెన్‌లో బిజీగా ఉంది..’ ‘కాల్ చేస్తాను..’ ‘షేర్ చేస్తాను..’ ‘పంక్చుయాలిటీ మెయిన్‌టైన్ చేయండి..’- ఇదీ తెలుగు! అన్ని భారతీయ భాషలూ దాదాపు ఇదే దుస్థితికి గురి అయి ఉన్నాయి. అందువల్ల కేంద్ర ప్రభుత్వ నిర్వాహక ప్రముఖులలో ఒకరైన అమిత్ షా వంటివారు చేయవలసింది తక్షణం రాజ్యాంగాన్ని సవరించడం. పూర్వ శిశు-ఎల్‌కెజి- శిశు- యుకెజి- స్థాయి నుంచి ఏడవ తరగతి వరకు దేశవ్యాప్తంగా అన్నిరకాల పాఠశాలలలోను విద్యాబోధన తప్పనిసరిగా ప్రాంతీయ మాతృభాషలలో జరగాలని నిర్దేశిస్తూ రాజ్యాంగాన్ని సవరించాలి! దాదాపు అన్ని ప్రాంతాల అన్ని రాజకీయ పక్షాలవారు మాతృభాషలను పరిరక్షించాలన్న నిష్ఠను ప్రదర్శిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇలాంటి రాజ్యాంగ సవరణ ‘బిల్లు’ను రూపొందించి పార్లమెంట్‌లో ప్రవేశపెట్టినట్టయితే ఎవ్వరూ బహుశా దాన్ని వ్యతిరేకించరు. హిందీని, ఇతర భారతీయ భాషలను దిగమింగుతున్న ఆంగ్లభాషా ఆధిపత్యాన్ని తొలగించుకోవడం ‘జాతీయ అధికార భాషా వికాసక్రమం’లో మొదటి మెట్టు. ఏడవ తరగతి వరకు మాతృభాషా మాధ్యమ బోధనను పొందిన వారు మాతృభాషలను మరచిపోలేరు. స్వదేశీయ విదేశీయ భాషలన్నీ సరస్వతీ రూపాలే. ఆంగ్లభాషను ఒక భాషగా ఆరవ తరగతి నుంచి అభ్యసించడానికి వీలుకల్పించవచ్చు. కానీ ఆంగ్ల మాధ్యమ బోధన నుంచి భారతీయ విద్యావిధానం విముక్తం కావాలి! విద్యాభ్యాసం పూర్తయ్యాక అమెరికాకు వెళ్లి స్థిరపడదలచినవారు ‘అమెరికా యాస’తో ‘బరగొంతుల’తో ఆంగ్ల భాషను ప్రత్యేకంగా అభ్యసించవచ్చు! శిశువులకు ‘‘బాబా బ్లాక్‌షీప్’’ అన్న ‘‘రెయిమ్’’లనుకాక ‘‘చందమామ రావె’’ ‘‘చందన్ హై ఇస్ దేస్‌కీ మాటీ’’వంటి భారతీయ పదాలను నేర్పించాలని కేవలం ప్రబోధించకండి. రాజ్యాంగాన్ని సవరించి తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ, ప్రభుత్వేతర విద్యాలయాలలో భారతీయ మాతృభాషలలో బోధించడాన్ని నియమంగా మార్చండి! ఎవరూ వ్యతిరేకించడానికి సాహసించని ఈ స్వదేశ భాషా పరిరక్షణకు అమిత్‌షా ఎందుకు వెంటనే నడుం బిగించరాదు? ఏడవ తరగతి వరకు బోధనామాధ్యమం తెలుగు కావాలి, ఆయా ప్రాంతాలలో తమిళం కావాలి, కన్నడం కావాలి, మరాఠీ కావాలి, హిందీ కావాలి, కశ్మీరీ భాష కావాలి!!
రాజ్యాంగంలోని మూడువందల యాబయ్యవ అధికరణంలోని ‘బి’ ఉప అధికరణం ప్రకారం ప్రతి ప్రాంతంలోను ఆ ప్రాంతంలోని ‘అల్పసంఖ్య’ భాషా జన సముదాయం వారి భాషను ప్రాథమిక పాఠశాల స్థాయిలో బోధించాలన్నది నియమం. కానీ ప్రతిప్రాంతంలోని ‘అధిక సంఖ్య’ ప్రజలు మాట్లాడే భాషను ప్రాథమిక పాఠశాల స్థాయిలో బోధించి తీరాలన్న రాజ్యాంగ నియమం ఇంతవరకు లేదు, అందువల్లనే ప్రాథమిక స్థాయినుంచి ప్రాంతీయ మాతృభాషలో బోధన జరగాలన్న కొన్ని రాష్ట్ర ప్రభుత్వాల ప్రయత్నాలకు న్యాయస్థానాలలో అవరోధాలు ఎదురయ్యాయి. ఇప్పుడైనా కేంద్రం రాజ్యాంగ సవరణ చేస్తే సమస్య ‘గోటి’తో తీరిపోతుంది. హిందీని అధికార భాషగాను, అనుసంధాన భాషగాను రాజ్యాంగంలో గుర్తించారు. కానీ అలా గుర్తించిన అధికరణాలలోనే ‘ఆంగ్లభాష అవసరమైనన్ని రోజులు’ అదనపు అధికార భాషగాను, అనుసంధాన భాషగాను కొనసాగవచ్చునని నిర్దేశించారు. ‘అదనపు భాష’ ప్రధాన ‘అధికార భాష’గా నెత్తికెక్కి తొక్కుతోంది. అధికార భాషను పాఠశాలలలో విధిగా చదివించినంతకాలం హిందీ జాతీయ భాషా కాజాలదు. పాఠశాలలలో కళాశాలలలో ‘‘రెండవ’’లేదా ‘అదనపు’అధికార భాష అయిన ఆంగ్లాన్ని విధిగా చదివిస్తున్నారు. హిందీకి ఆ ప్రతిపత్తి లేదు. ‘ఇంగ్లీషు’ను కళాశాలలో ఎనిమిది గంటలపాటు బోధిస్తున్నారు. హిందీకి కేవలం నాలుగు గంటలు మాత్రం కేటాయిస్తున్నారు. పైగా హిందీని కాని ఇతర భారతీయ భాషలను కాని ‘ఐచ్ఛికం’గా మాత్రమే కళాశాలలలో చదివిస్తున్నారు, ఇంగ్లీషును విధిగా చదివించినట్టు హిందీని కాని ఇతర భారతీయ భాషలను కాని కళాశాలలలో చదివించడం లేదు.
పార్లమెంటులో ఇప్పటికీ బిల్లులను ఆంగ్లంలో రూపొందిస్తున్నారు. ఆ తరువాత ఆంగ్లం నుంచి హిందీలోకి అనువదిస్తున్నారు. మూడువందల నలబయి ఎనిమిదవ అధికరణం ఈ దౌర్భాగ్యస్థితిని ఏర్పాటుచేసింది. ఈ అధికరణం ప్రకారం రాష్టల్ర శాసనసభల బిల్లులను కూడ మొదట ఇంగ్లీషులోనే రూపొందించి, తరువాత ఆయా ప్రాంతీయ భాషలలోకి అనువదించాలి. ఉన్నత సర్వోన్నత న్యాయస్థానాలలో ఇప్పటికీ ఆంగ్లభాష ఏకైక అధికార భాష.. హిందీకి స్థానం లేదు! ఇతర భారతీయ భాషలకు అవకాశం లేదు!! ఈ అధికరణాన్ని సవరించి హిందీ భాషకు ఇతర భారతీయ ప్రాంతీయ భాషలకు ప్రాధాన్యం ఇప్పుడైన ఎందుకు కల్పించరాదు? విదేశీయ దురాక్రమణ మొదలయ్యేవరకు మన దేశంలో ‘సంస్కృతం’ అధికార భాష, పాలన భాష, అనుసంధాన భాష, ఉన్నత విద్యాబోధనకు మాధ్యమ భాష! బ్రిటన్ దురాక్రమణకారులు క్రీస్తుశకం 1834 నుంచి ‘సంస్కృత భాష’ను క్రమంగా తొలగించి ఆంగ్ల భాషను దాని స్థానంలో ప్రవేశపెట్టారు. పాఠశాలలలో కళాశాలలలో ఆంగ్లభాషను విధిగా చదివించడంవల్ల మాత్రమేకాక, ఉన్నత విద్యను ఆంగ్లమాధ్యమంగా బోధించడంవల్ల బ్రిటన్‌వారు ఆంగ్లభాషను అధికార భాషగా, అనుసంధాన భాషగా వ్యవస్థీకరించారు. ఈ చారిత్రక సారాన్ని బ్రిటన్ విముక్త భారతదేశపు పాలకులు గ్రహించకపోవడం జాతీయ వైపరీత్యం. హిందీని కాని మరో భారతీయ భాషను కాని అధికార భాషగా, అనుసంధాన భాషగా వ్యవస్థీకరించదలచుకొనట్టయితే మొదట ఆ భాషను దేశమంతటా ఉన్నత విద్యాబోధనకు మాధ్యమంగా నిర్ణయించాలి. ఇందుకోసం కూడ రాజ్యాంగ సవరణ అనివార్యం.. ప్రాంతీయ భారతీయ భాషలలో ప్రాథమిక మాధ్యమిక విద్యాబోధన జరగాలి. జాతీయ అధికార భాష మాధ్యమంగా ఉన్నత విద్యాబోధన జరగాలి! 1950వ దశకంలోనే ఈ కార్యక్రమం అమలుజరిగి ఉండినట్టయితే భారతీయులు భారతీయులుగా ఎదగడానికి వీలుకలిగి ఉండేది. కానీ బ్రిటన్ దురాక్రమణ సమయంలోకంటె మరింత విస్తృతంగా మరింత పటిష్ఠంగా ఆంగ్లమాధ్యమ బోధనను ఏడు దశాబ్దులుగా కొనసాగిస్తున్నాము. అందువల్ల భారతీయులు ఐరోపా వారి వలె ఆలోచిస్తున్నారు, వ్యవహరించ యత్నిస్తున్నారు. ఐరోపా వారి వలె జీవించడమే నిజమైన భారతీయత అని భ్రమిస్తున్నారు...
హిందీ, ఆంగ్లభాషల మధ్య ఒకదాన్ని ఎంచుకోవలసి వచ్చినట్టయితే నిజమైన భారతీయులు ఇప్పటికైనా హిందీని ఎంచుకోవాలన్నది స్వజాతీయ నిష్ఠ.. హిందీ భారతీయ భాష, ఆంగ్లం భారతీయ భాష కాదు! హిందీ కూడ భారతదేశంలోని కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమైన భాష! హిందీతోపాటు మరో ఇరవై మూడు ప్రధాన ప్రాంతీయ భాషలు దేశంలో ఉన్నాయి. ఈ భాషలన్నీ కూడ సంస్కృత భాషా రూపాంతరాలు. ‘్భరతీయ జాతీయత’ యుగాలుగా వికసించడానికి భూమిక సంస్కృత భాష! దేశంలోని వివిధ ప్రాంతాలలో ‘సంస్కృత’్భష ప్రాకృత భాషలుగా రూపాంతరం చెందింది. ప్రాకృత భాషలు వర్తమాన సమాజంలో తెలుగు తమిళ కన్నడ హిందీ అస్సామీ బెంగాలీ వంటీ ప్రాంతీయ భాషలుగా పరిణతి చెందాయి. అందువల్లనే ప్రతి ప్రాంతానికి ఒక మాతృభాష ఏర్పడింది. కానీ మొత్తం భారత జాతికి మాతృభాష ‘సంస్కృతం’అన్నది తరతరాల చరిత్ర.. ఈ చరిత్రను బ్రిటన్‌వారు చెఱచిపోయారు. బ్రిటన్ దురాక్రమణకు పూర్వం జాతీయ అధికార భాషగా ఉండిన సంస్కృత భాష బ్రిటన్ విముక్త భారత్‌లో జాతీయ అధికార భాష కావాలని బాబాసాహెబ్ అంబేద్కర్ మహాశయుని వంటి జాతీయ నిష్ఠకలవారు భావించారు. రాజ్యాంగ పరిషత్‌లో వారి మాట నెగ్గకపోవడం మరో జాతీయ వైపరీత్యం. ఇప్పుడైన సంస్కృత భాషను ఏకైక జాతీయ అధికార భాషగా ప్రకటించడానికి వ్యవస్థీకరించడానికి ప్రభుత్వం ఎందుకు యత్నించరాదు??