సంపాదకీయం
పొత్తుల రణ ‘ధ్వని’
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
చలన చిత్రాలలో వేషాలు వేసే వారికి రాజకీయాలలో నాయక పాత్రలను పోషించడం ఇక అసాధ్యమన్నది తమిళనాడులో తేలిన ‘నిగ్గు’! ఇలా నిగ్గుతేలడం మహా చలన చిత్ర నటులకు అవమానం కాదు, వారి అభినయ గరిమకు ‘గీటురాయి’ కూడ కాదు. ఏ రంగంలోని మహాపురుషులు ఆయా రంగాలలోనే ప్రజలకు గొప్ప సేవ చేయవచ్చునన్నది ప్రస్ఫుటించిన వాస్తవం! సమాజంలో ప్రతి రంగమూ గొప్పది, ప్రాధాన్యం కలది. అందువల్ల ఒక రంగం నుండి మహనీయులు, ప్రజాసేవా తత్పరులు మరో రంగానికి ఫిరాయించనక్కర లేదన్నది తమిళ రాజకీయంలో ప్రస్తుతం ప్రస్ఫుటించిన నీతి! తమ రంగంలోనే ఉండి ప్రజలకు మేలుచేయవచ్చు! ‘‘కాదు కాదు రాజకీయ రంగంలోకి చొరబడడంవల్ల మాత్రమే ప్రజాసేవ చేయగలం, భరతమాతను పూజించగలం’’ అని రాజకీయేతర రంగాలలోని ప్రముఖులు భావించడం తమ రంగాలకు ఆయా రాజకీయేతర రంగాలవారు చేస్తున్న అవమానం! లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్నవేళ తమిళనాడు ఇతర ప్రాంతాలకు నేర్పుతున్న పాఠం ఇది. ఆర్భాటంగా రాజకీయ రంగప్రవేశం చేసిన చలనచిత్ర రంగ మహానటుడు రజనీకాంత్ తమ పార్టీ లోక్సభ ఎన్నికలలో పోటీచేయడం లేదని ప్రకటించడం ఇందుకు నిదర్శనం. అంతేకాదు ఏ ఇతర పార్టీ తరఫున కూడ వారి పార్టీవారు ప్రచారం చేయరట! కమల్హాసన్ అన్న మరో చలనచిత్ర మహా అభినయవేత్తతో సైతం ఇంతవరకు ‘అన్నా ద్రవిడ మునేత్ర కజగం’- అ ద్రముక- వారు కాని ‘ద్రవిడ మునె్నత్ర కజగం’- ద్రముక- వారు కాని పొత్తుకోసం చర్చలు జరిపిన దాఖలాలేదు! రజనీకాంత్తో పొత్తుకోసం ‘్భరతీయ జనతా పార్టీ’ కానీ కమల్హాసన్తో పొత్తుకోసం కాంగ్రెస్ కానీ లోక్సభ ఎన్నికలు ముగిసేవరకూ చర్చలు జరిపే అవకాశం లేదు. ఎందుకంటే ఈ రెండు పార్టీలు చెరో ‘ప్రధాన ద్రవిడ పక్షాల కూటమి’లో చేరిపోయాయి. ‘తమిళనాడు’లో ముప్పయితొమ్మిది, ‘పుదుచ్చేరి’లో ఒక లోక్సభ స్థానాలున్నాయి. ‘అన్నా ద్రముక’ కూటమిలో చేరిపోయిన ‘్భజపా’కు ఐదు లోక్సభ స్థానాలలో పోటీ చేయడానికి అవకాశం దక్కింది. ‘ద్రముక’ కూటమిలో భాగంగా ‘కాంగ్రెస్’ పది లోక్సభ స్థానాలలో పోటీచేస్తుందట! అందువల్ల ఈ రెండు జాతీయ పార్టీలు కూడ ఇక నేరుగా ‘రజనీ మక్కల్ మంద్రమ్’ -రమమ- తో కాని, కమల్హాసన్ నాయకత్వంలోని ‘మక్కల్ నీతి మహీమమ్’ మనీమ-తో కాని నేరుగా చర్చలు జరుపజాలవు. జరిపితే- గిరిపితే- ‘ద్రముక’వారు, ‘అన్నా ద్రముక’వారు కాని ఈ ‘చిత్ర’పక్షాలతో చర్చలు జరపాలి, జరుపనున్న సూచనలు కన్పించడం లేదు. తాను రాజకీయ రంగప్రవేశం అప్పటికే చేసి ఉండినట్టు కమల్హాసన్ 2017 సెప్టెంబర్ 16న చారిత్రక ప్రకటన చేశాడు. అదే సంవత్సరం డిసెంబర్ 31వ తేదీన రజనీకాంత్ లాంఛనంగా రాజకీయ ప్రవేశం చేశాడు. అంతకు పూర్వం ‘ద్రముక’తో మైత్రిని నెరపిన రజనీకాంత్కూ ఆ పార్టీకి మధ్య అప్పటినుంచి ‘వైరం’రాజుకున్నట్టు ప్రచారమైంది!
ఇలా అన్నా ద్రముక, ద్రముక కూటములలో ‘స్పష్టత’ ఏర్పడడం లోక్సభ ఎన్నికలకోసం జాతీయస్థాయి ఏర్పడనున్న ‘్భజపా’ వ్యతిరేక కూటముల స్వరూప స్వభావాలను ప్రభావితం చేయనున్న పరిణామం. జాతీయ స్థాయిలో ‘్భజపా’కు వ్యతిరేకంగా రెండు కూటములు ఏర్పడుతుండడం గొప్ప ప్రాధాన్యాన్ని సంతరించుకున్న పరిణామం. మొదటిది, కాంగ్రెస్ ‘సహిత’కూటమి! రెండవది కాంగ్రెస్ ‘రహిత’ కూటమి! రెండు కూటములకూ తెలుగు నాయకులు ఆధ్వర్యం వహిస్తుండడం దేశ ప్రజలను, ప్రధానంగా రాజకీయ కుతూహల స్వభావంతో సిద్ధాంత రాద్ధాంత చర్చలను జరుపుతున్నవారిని ‘‘ఊరిస్తున్న’’ మరో ఉత్కంఠ! ఈ ఉత్కంఠ కొంత తొలగిపోవడానికి సైతం ఇటు తమిళనాడులో బిగిసిన పొత్తులు అటు ఉత్తరప్రదేశ్లో వెలసిన పరిణామాలు దోహదం చేస్తుండడం లోక్సభ ఎన్నికల రణరంగానికి పూర్వరంగం....
రజనీకాంత్ ‘్భజపా’తో పొత్తుపెట్టుకోరాదని కమల్హాసన్ నిర్దేశించినట్టు కూడ కొంతకాలం ప్రచారం జరిగింది. ‘్భజపా’తో ‘‘పొత్తుపెట్టుకునే’’ రజనీకాంత్తో తాను పొత్తుపెట్టుకోనని కమల్హాసన్ ‘‘చారిత్రకమైన’’ హెచ్చరికలు చేసినట్టుకూడ ప్రచారమైంది. ఇదంతా కమల్హాసన్ వంటి అభినయవేత్తలు తమకుతాము ఆపాదించుకున్న విచిత్ర రాజకీయ ప్రాధాన్యం. అందువల్ల కమల్హాసన్తో జట్టుకట్టడానికి వీలుగా రజనీకాంత్ ‘్భజపా’కు దూరంగా ఉంటాడన్నది ప్రబలిన అభిప్రాయం. రజనీకాంత్ లోక్సభ ఎన్నికలకే దూరంగా ఉండాలని నిర్ధారించాడు కాబట్టి కమల్హాసన్ తనకుతానే కల్పించుకున్న ‘ప్రాధాన్యభ్రాంతి’పై మరింత మీమాంసకు అవకాశం లేకుండా పోయింది. దానికి సంబంధించిన ఉత్కంఠ ఉత్కంఠగానే మిగిలిపోవడం కుతూహలగ్రస్తులకు మరో చర్చనీయాంశం. జాతీయస్థాయి కూటములకు సంబంధించినంతవరకు తమిళనాడులో స్పష్టత వచ్చేసింది! తమిళనాడుకు సంబంధించినంతవరకు ‘్భజపా’కు వ్యతిరేకంగా ‘కాంగ్రెస్ సహిత కూటమి’ ‘ద్రముక’ ఆధ్వర్యంలో అవతరించింది. అందువల్ల ‘కాంగ్రెస్ రహిత కూటమిని ఏర్పాటుచేస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి, ‘తెరాస’ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు మదరాసుకు వెళ్లి ద్రవిడ పక్షాలతో చర్చలుజరిపే శ్రమతప్పింది. సమయం ఆదా అయింది. ‘‘కాంగ్రెస్ సహిత ‘్భజపా’ వ్యతిరేక జాతీయ కూటమి’’ని ఏర్పాటుచేయడానికి నడుం బిగించి ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ‘తెలుగుదేశం పార్టీ’- తెదేపా- అధినేత నారా చంద్రబాబునాయుడుకు ఉత్తరప్రదేశ్కు వెళ్లిరావలసిన శ్రమ తప్పిపోవడం సమాంతర పరిణామం. తమిళనాడులోని పొత్తుల స్వభావానికి భిన్నంగా ఉత్తరప్రదేశ్లో ‘కాంగ్రెస్ సహిత’ ‘్భజపా’ వ్యతిరేక కూటమి ఏర్పడిపోయింది. మాజీ ముఖ్యమంత్రి మాయావతి నాయకత్వంలోని బహుజన సమాజ్ పార్టీ- బసపా- కానీ, మరో మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ ఆధ్వర్యంలోని ‘సమాజ్ వాదీ పార్టీ’ - సపా- కానీ కాంగ్రెస్ను తమ జట్టులో చేర్చుకొనలేదు...
ఇలా తెలుగు రాష్ట్రాల అధికార పక్షాల అధినేతలకు చెరో ‘విజయం’ లభించడం పొత్తుల పర్వంలోని ప్రథమాధ్యాయం! ఈ ప్రస్తుత అధ్యాయంలోనే ‘్భజపా’కు శివసేనకు మధ్య లోక్సభ స్థానాల పంపిణీ జరిగిపోవడం, ఊగిసలాడుతుండిన ‘మైత్రి’ మళ్లీ కుదురుగా నిలబడడం సమాంతర పరిణామం! మహారాష్టల్రోని నలబయి ఎనిమిది లోక్సభ స్థానాలలో ‘్భజపా’ ఇరవై ఐదుచోట్లు, శివసేన ఇరవైమూడు చోట్లు పోటీచేస్తాయట! మహారాష్టల్రో ఇలా శివసేనతో కుదరదనుకున్న పొత్తు కుదిరిన సమయంలోనే అస్సాంలో ‘అస్సాం గణపరిషత్’ భాజపాతో తెగ తెంపులు చేసుకుంది. అందువల్ల ఉభయ రకాల ‘్భజపా’ వ్యతిరేక కూటముల నేతలు కూడ చర్చలు జరపడానికి మరో రాజకీయ పక్షం లభించింది! ఉత్తరప్రదేశ్లో ‘సపా’, ‘బసపా’ల మధ్య గతనెల పనె్నండవ తేదీననే ఆధికారికంగా కుదిరింది, ఈ కూటమిలో కాంగ్రెస్ను చేర్చుకోలేదు. ఆ తరువాతనే ప్రియాంకగాంధీ వాద్రా రాజకీయ రంగ ప్రవేశం జరిగింది. గతనెల 23న ఆమె కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా నియుక్తురాలయింది. ప్రియాంక ప్రవేశంతో ‘సపా’ ‘బసపా’లు ప్రభావితం అవుతాయని, ప్రియాంక ప్రారంభించనున్న ప్రభంజనానికి భయపడి తమ జట్టులో కాంగ్రెస్ను చేర్చుకుంటామనీ ‘‘పుటపుట’’లు బయలుదేరాయి. కానీ ఉత్తరప్రదేశ్ రాజకీయాలలో ప్రియాంక ప్రభావం ఏమీలేదన్నది ‘బసపా’ ‘సపా’ల కూటమి ‘రట్టు’చేయదలచిన రహస్యం. అందువల్లనే ఈ పార్టీలు రాష్ట్రీయ లోక్దళ్కు మూడుస్థానాలు కేటాయించాయి. కాంగ్రెస్ రెండు ‘సీట్ల’ను దయతో వదలిపెట్టడంతో ఈ పార్టీలు కాంగ్రెస్కు ప్రత్యేకించి ప్రియాంకమ్మకు ఇచ్చిన ‘‘ప్రాధాన్యం’’ ధ్వనిస్తోంది!