జనాంతికం - బుద్దా మురళి

కెసిఆర్-బాబు-జగన్ మిస్టరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘దీని వెనుక ఏదో మతలబు ఉందనిపిస్తోంది. బాబు మంచి మిత్రుడని కెసిఆర్ చెప్పడం మాయగా ఉంది’’
‘‘కోటి ఎకరాలకు సాగునీరిస్తానన్న విషయంపైనా నీ అనుమానం’’
‘‘నీళ్లిస్తే నాకేంటి, ఇవ్వక పోతే ఏంటీ ? హైదరాబాద్‌లో నాకు ప్లాట్లు తప్ప వ్యవసాయ భూమి లేదు. అసలు విషయం ఉద్దేశ పూర్వకంగా దాట వేస్తున్నావు’’
‘‘ ఇలానే తెలివిగా ఆలోచిస్తే అసలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ , పాకిస్తాన్ అధ్యక్షుడు నవాజ్ షరీఫ్‌ల మధ్యనే ఏదో మతలబు ఉంది.
షరీఫ్ మనవరాలి పెళ్లి వేడుకలకు మోదీ ఎందుకు వెళ్లారు. చిన్ననాటి మిత్రులా? దగ్గరి బంధువులా? ఇంకాస్త విస్తృతంగా ఆలోచిస్తే అమెరికాకు పాకిస్తాన్‌కు మధ్య కూడా ఏదో మతలబు ఉంది. అమెరికా నిధులతోనే పాకిస్తాన్ బతుకుతుంది. అమెరికా స్నేహపూర్వకంగా ఇచ్చే ఆయుధాలతోనే పాకిస్తాన్ యుద్ధాలు చేస్తుంది. అమెరికాకు పాక్‌తో స్నేహం, చైనా పాకిస్తాన్ మా స్నేహ దేశం అని ప్రకటించింది. మోదీ పాకిస్తాన్ వెళ్లి వచ్చారు. అంటే అమెరికా, చైనా, ఇండియా, పాకిస్తాల మధ్య బహిరంగ స్నేహం, రహస్య శతృత్వం మిస్టరీ ఉందనిపిస్తోంది. దశాబ్దాల పాటు శత్రువులుగా పోరాడిన క్యూబాకు అమెరికా స్నేహ హస్తం అందించింది. మొత్తం ప్రపంచ దేశాల మధ్యనే ఏదో రహహ్య మతలబు సాగుతున్నట్టు అనిపించడం లేదా? ’’
‘‘ఏదో చెప్పి నన్ను నన్ను కన్‌ఫ్యూజ్ చేయాలని ప్రయత్నిస్తున్నావు. నేను రెండు తెలుగు రాష్ట్రాల నాయకుల స్నేహం గురించి చెబుతుంటే నువ్వు ప్రపంచ దేశాల గురించి మాట్లాడుతున్నావు.
‘‘సరే లోకల్ మిస్టరీ గురించే మాట్లాడుకుందాం. కెసిఆర్‌కు బాబుతోనే కాదు అందరితో రహస్య స్నేహం ఉందనిపిస్తోంది. 2014 ఎన్నికల పోలింగ్ ముగియగానే తెలంగాణలో టిఆర్‌ఎస్, ఆంధ్రలో జగన్ అధికారంలోకి వస్తారని చెప్పారు కదా? ఏ బంధం లేకుంటేనే ఇలా చెబుతారా? పైగా నిప్పులాంటి మనిషి బాబు కూడా కెసిఆర్ జగన్ కుమ్మక్కయ్యారని ఎన్నిసార్లు చెప్పలేదు. ఇక ఢిల్లీలో సోనియాగాంధీ ఇంటికి సకుటుంబ సపరివారంగా వెళ్లారు. అంటే కాంగ్రెస్‌తో బంధం బహిరంగ రసహ్యమే కదా? మరోవైపు మోదీతో స్నేహం నడుపుతున్నారు. ఇక ఎంఐఎం మంచి స్నేహితులే. సిపిఐ నారాయణ నాకు మంచి మిత్రులు అని కెసిఆర్ చాలా సార్లు చెప్పారు. కెసిఆర్ బాబు పాత స్నేహం, కెసిఆర్ జగన్‌లది కొత్త స్నేహం. స్నేహితుడి స్నేహితుడు కూడా స్నేహితుడే అవుతాడు కదా? దీన్ని బట్టి వీళ్లంతా స్నేహితులే అవుతారు’’
‘‘ నువ్వు చెబుతుంటే నిజమే అనిపిస్తోంది. కెసిఆర్‌కు బాబో జగనో ఒక్కరితో స్నేహం ఉండాలి కానీ ఇదేంటి ? ’’
‘‘నీ ఆలోచనలో గందరగోళం ఉంది కానీ జరుగుతున్న పరిణామాల్లో ఎలాంటి గందరగోళం లేదు. ఒక్కో పాత్రకు ఒక్కో బాధ్యత ఉంటుంది. నువ్వు అదే గ్రహించడం లేదు. ఉమ్మడి రాష్ట్రంలో ఏ నేత నోట విన్నా తెలంగాణకు పెద్ద పీట అనే మాటలు వినిబడేవి. ఎన్టీఆర్ భవన్‌లో ఒక అంతస్థు నిండా పెద్ద పీటలు తయారు చేయించి పెట్టారనే మాట కూడా వినిపించేది. అప్పుడు పాలమూరు జిల్లాను బాబు ఏకంగా దత్తత తీసుకున్నారు. అదే బాబు పాలమూరు ఎత్తిపోతల పథకం ఆంధ్రకు ప్రమాదం అని కేంద్రానికి ఫిర్యాదు చేశారు. గట్టిగా ఫిర్యాదు చేయలేదని శాసన సభలో జగన్ నిలదీశారు. విలేఖరుల సమావేశాల్లో తెలంగాణపై బాబు, జగన్ చూపిన ప్రేమను గుర్తుకు తెచ్చుకున్న వారికి ఈ ఫిర్యాదు నమ్మశక్యం కాదు. ఉమ్మడి రాష్ట్రంలో పెద్దపీటలు వేయడం రాజకీయంగా అవసరం. ఆంధ్ర సిఎంగా పాలమూరు ప్రాజెక్టును వ్యతిరేకించడం ఇప్పటి అవసరం. తెలంగాణ ఉద్యమ కాలంలో, ఎమ్మెల్యేలను కొని ప్రభుత్వాన్ని అస్థిర పరచాలని చూసిన సందర్భంలోనైనా కెసిఆర్‌కు బాబు శత్రువే. ఇప్పుడు రాష్ట్రంలో వారి పార్టీనే కనుమరుగైనప్పుడు ఇంకెక్కడి శతృత్వం?
యాచకునికి యాచకుడే శత్రువు అన్నారు కానీ రాజుకు రాజు కూడా శత్రువే. ఆనకట్టలు కట్టి తన రాజ్యం సుభిక్షంగా ఉండేట్టు చూసుకోవడం రాజు బాధ్యత కానీ పక్క రాజ్యంలో నాయుడు పార్టీ ఉండాలా? రెడ్డి రాజ్య పాలన సాగాలా?అనే దానిపై ఆసక్తి ఎందుకుంటుది. రాజుతో సంబంధాలు ముఖ్యం కానీ రాజు ప్రత్యర్థితో కాదు.
బాధ్యత అంతే తప్ప పొరుగున రెడ్డి రాజ్యం ఉండాలా? నాయుడు రాజ్యం పతనం కావాలా? అనేది పాలకుడికి ముఖ్యం కాదు. ఏ రాజ్య పాలకునికి ఆ రాజ్య ప్రయోజనాలు ముఖ్యం.
‘‘ నువ్వు ఎన్ని చెప్పినా కెసిఆర్ చెప్పినట్టు ప్రాజెక్టులు పూర్తవుతాయని నాకైతే అనిపించడం లేదు’’
‘‘ వర్షాలు వస్తే సాగు లేదంటే కన్నీళ్లే జీవితంగా గడిపే తెలంగాణ పల్లెలు రెండు పంటల పండించే రోజులు రాబోతున్నాయి అని వింటేనే మనసు పులకించి పోతుంది? ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన యోధుడికైనా, చంద్రుడిపై తొలిసారి పాదం మోపిన వీరుడికైనా తొలుత కొన్ని లక్షల గొంతులు ఇది అయ్యేదా పొయ్యేదా? అని వారి వారి మాతృభాషల్లో ముందు మాటలు పలికిన వారే’’
‘‘ అవుతాయంటావా? ’’
‘‘ ఎవరెస్ట్ శిఖరం అధిరోహిస్తానని తొలుత చెప్పినప్పుడు కొన్ని వందల గొంతులు అయ్యే పని కాదులే అని స్వాగత వచనాలు పలికాయి. వాటిని పట్టించుకోకుండా ఎవరెస్ట్ ఎక్కిన ఎడ్మండ్ హిల్లరీ పేరు మనకు గుర్తుంది కానీ ఆ లక్షల గొంతుల్లో ఒక్క పేరూ గుర్తు లేదు. చందమామపై కాలు మోపేందుకు వెళుతున్న నీల్ ఆర్మ్ స్ట్రాంగ్‌కూ ఇలానే బృంద గీతం వినిపించారు. కెసిఆర్ తెలంగాణ కోసం వెళ్లినప్పుడు కూడా చాలా పెద్ద పెద్ద గొంతులు ఇలానే అన్నారు. ’’
‘‘ అంటే కోటి ఎకరాలకు సాగునీరు వస్తుందని అంత నమ్మకమా? ’’
‘‘ గోదావరి, కృష్ణా నదులతో పొలాలు తడిస్తే మంచిదే,కాక పోతే కొన్ని వందల ఏళ్ల నుంచి అణిచివేత, పేదరికం,కరువుతో సహజీవనం చేసిన వాడికి కొత్తగా పోయేదేముంది. యత్భావం తత్భవతి.. రెండు రాష్ట్రాల రైతులకు మంచే జరుగుతుందనుకుందాం పోయేదేముంది’’