రాష్ట్రీయం
వివాహేతర సంబంధం : ఇద్దరు బలి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
కదిరినాథునికోటలో భార్య, ప్రియుడిని హతమార్చిన భర్త
ములకలచెరువు, డిసెంబర్ 6: భార్య, ప్రియుడు వేట కొడవలితో భర్త హతమార్చిన సంఘటన చిత్తూరు జిల్లా ములకలచెరువు మండలంలోని కదిరినాధునికోటలో ఆదివారం చోటుచేసుకుంది. ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. కదిరినాధునికోట గ్రామానికి చెందిన డేగాని వెంకటరమణ (40)కు కురబలకోట మండలానికి చెందిన ఆరుణమ్మతో 17 సంవత్సరాల క్రితం వివాహమైంది. అదే గ్రామానికి చెందిన చాట్లా ఆదినారాయణ (30),కు ఏడాదన్నర క్రితం అనంతపురానికి చెందిన భారతితో వివాహమైంది. వీరికి మూడు వారాల బాలిక ఉంది. కాగా గ్రామంలో వెంకటరమణ, ఆదినారాయణ ఇళ్లు పక్క పక్కనే ఉన్నాయి. ఈక్రమంలో అరుణమ్మ, ఆదినారాయణ మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం అరుణమ్మ భర్త వెంకటరమణకు వీరిద్దరి వివాహేతర సంబంధం తెలిసింది. ఈ విషయాన్ని జీర్ణించుకోలేక అతడు అతిగా మద్యం సేవించి వీరిని హతమార్చేందుకు శనివారం రాత్రి నుండి తన ఇంటి ముందు ఉన్న ముళ్లపొదల్లో కాపు కాశాడు.
కాగా ఆదివారం తెల్లవారుజామున భార్య అరుణమ్మ బహిర్భూమికి వెళ్లింది. అదే సమయంలో ఆదినారాయణ కూడా ఆమె వెంట వెళ్లడాన్ని భర్త వెంకటరమణ చూశాడు. అరుణమ్మ వద్దకు వెళ్లిన అతడు ఆమెపై వేటకొడవలితో నరకడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఈ సంఘటనను చూసిన ఆదినారాయణ గ్రామంలోకి పరుగులు తీశాడు. అయితే వెంకటరమణ వెంటాడి వెంటాడి ఆదినారాయణ తలపై రెండుమార్లు నరకడంతో అతను కూడా అక్కడికక్కడే మృతి చెందాడు. వీరిద్దరిని హతమార్చిన వెంకటరమణ వేటకొడవలితో గ్రామంలోకి వచ్చాడు. అతడు అంతటితో ఆగకుండా మాజీ సర్పంచ్ మోహన్రెడ్డి ఇంటి వద్దకు వెళ్లి రెడ్డి నేను వారిద్దరిని చంపేశాను అంటూ అతడిని మృతదేహాల వద్దకు తీసుకెళ్లి హంతకుడు వేట కొడవలితో పరారయ్యాడు. విషయం తెలుసుకున్న ములకలచెరువు సిఐ రుషికేశవ్, ఎస్ఐ మునిస్వామి సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పుంగనూరులో మహిళ హత్య
పుంగనూరు : ఓ మహిళను ప్రియుడు హతమార్చిన సంఘటన ఆదివారం చిత్తూరు జిల్లా పుంగనూరు మండలంలో చోటుచేసుకుంది. ఎస్సై హరిప్రసాద్ కథనం మేరకు మండలంలోని నెక్కుంది పంచాయతీ మొరుంపల్లె గ్రామానికి చెందిన వెంకటప్ప భార్య పార్వతమ్మ (55)తో అదే గ్రామానికి చెందిన నారాయణ కొంతకాలంగా వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అయితే పార్వతమ్మ వేరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో ఆగ్రహించిన నారాయణ పార్వతమ్మ తలపై సుత్తితో కొట్టగా అక్కడికక్కడే మృతిచెందింది. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.