జాతీయ వార్తలు

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై దర్యాప్తు కమిటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ:హైదరాబాద్‌లోని చౌటాన్‌పల్లిలో జరిగిన దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై సుప్రీం కోర్టు దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఆదేశాలను జారీ చేసింది. హైదరాబాద్‌లోనే ఉండి ఈ కమిటీ దర్యాప్తు చేస్తుందని ధర్మాసనం స్పష్టంచేసింది. ఈ విచారణ విశ్వసనీయతకు సంబంధించిన అంశమని తెలిపింది. సుప్రీంకోర్టు మాజీ జడ్జి వీఎస్ సిర్పూర్కర్ నేతృత్వంలో ముగ్గురు సభ్యుల ఈ జ్యుడీషియల్ కమిటీ విచారణ జరుపుతుందని తెలిపింది. ఎన్ కౌంటర్ పై విచారణ ప్రారంభించిన తేదీ నుంచి ఆరు వారాల్లోగా తమకు నివేదిక సమర్పించాలని చెప్పింది.ఈ కమిటీలో వీఎస్ సిర్పూర్కర్ తో పాటు బాంబే హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రేఖా ప్రసాద్ సీబీఐ మాజీ డైరెక్టర్ కార్తికేయన్ ఉన్నారు.