క్రైమ్/లీగల్

ఆటోను ఢీకొన్న లారీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గొల్లప్రోలు, ఏప్రిల్ 26: గొల్లప్రోలు-చేబ్రోలు గ్రామాల మధ్య 216 జాతీయ రహదారిపై గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ మృతిచెందగా ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం పిఠాపురం నుండి కత్తిపూడి వెళుతున్న ఆటోను చెందుర్తి సెంటర్ సమీపంలో వైజాగ్ నుండి కాకినాడ వైపు వెళుతున్న లారీ ఢీకొట్టింది. ఈప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ప్రత్తిపాడు మండలం ధర్మవరం గ్రామానికి చెందిన జువ్వల పద్దాలమ్మ (55) అక్కడికక్కడే మృతిచెందింది. అలాగే దుర్గాడ గ్రామానికి చెందిన ఉమ్మిడి వెంకటేశ్వరరావు (ఆటో డ్రైవర్, దార యేసు రత్నం, పండు, మేరుగ మణి, సత్యవతిలు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం పిఠాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు