క్రైమ్/లీగల్

భర్త చేతిలో హత్యకు గురైన శ్రీలక్ష్మి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హనుమాన్ జంక్షన్,డిసెంబరు 14: బాపులపాడు మండలం మల్లవల్లిలో శనివారం ఉదయం దారుణం జరిగింది. కట్టుకున్న వాడే భార్యను అనుమానంతో గొడ్డలితో నరికి చంపాడు. గ్రామంలో తీవ్ర అలజడి రేపిన ఈ సంఘటనకు సంబంధించి హనుమాన్ జంక్షన్ సి.ఐ రమణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మల్లవల్లికి చెందిన కట్టుబోయిన వెంకటరత్నంకు, ఆగిరిపల్లి మండలం అడవినెక్కలం గ్రామానికి చెందిన శ్రీలక్ష్మి(31)కి 12 సంవత్సరాల క్రితం వివాహమైంది. కొన్నాళ్ల క్రితం శ్రీలక్ష్మి తండ్రి మృతి చెందడంతో అస్తి పంచుకున్నారు. శ్రీలక్ష్మికి అస్తిలో వాటా వస్తుందని, తనకు ఇవ్వాలని వెంకటరత్నం తరచూ ఘర్షణకు దిగేవాడు. నాలుగు నెలల క్రిందట శ్రీలక్ష్మి గ్రామానికే చెందిన ఒక వ్యక్తితో మాట్లాడం అమెపాలిట శాపంలా మారింది. అప్పటి నుంచి భార్యపై వెంకటరత్నం అనుమానం పెంచుకున్నాడు. ఈ దశలో ఇద్దరి మధ్య వాగ్వాదాలు జరుగుతుండంతో శ్రీలక్ష్మి పుట్టింటికి వెళ్ళింది. 20 రోజుల క్రితం పెద్దలు వీరి మధ్య రాజీ చేసి కాపురానికి పంపారు. శుక్రవారం రాత్రి వెంకటరత్నం మరోసారి భార్య శ్రీలక్ష్మిపై అనుమానం వ్యక్తం చేస్తూ ఘర్షణకు దిగాడు. ఈ ఘర్షణ తీవ్ర స్థాయికి చేరడంతో అవేశంలో గొడ్డలితో శ్రీలక్ష్మి మెడపై దాడి చేశాడు. దీంతో తీవ్రంగా గాయపడిన శ్రీలక్ష్మి అక్కడిక్కడే మృతి చెందింది. శ్రీలక్ష్మి మృతి చెందడంతో వెంకటరత్నం అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికుల సమాచారం మేరకు శనివారం ఉదయం సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సంఘటన స్ధలంలో హత్యకు ఉపయోగించిన గొడ్డలిని స్వాధీనం చేసుకున్నారు. హనుమాన్ జంక్షన్ సి.ఐ రమణ కేసు దర్యాప్తు చేస్తున్నారు. వీరవల్లి ఎస్.ఐ చంటిబాబు ఈ సంఘటనకు సంబంధించి వివరాలను గ్రామస్తుల నుంచి సేకరిస్తున్నారు.