క్రైమ్/లీగల్

ప్రైవేటు ట్రావెల్ బస్సు దగ్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, డిసెంబర్ 2: నల్లగొండ జిల్లాలో ఒక ప్రైవేట్ బస్సు మంటల్లో దగ్ధమైంది. నార్కట్‌పల్లి-అద్దంకి మార్గంలో హైద్రాబాద్ నుండి ఒంగోలు వెళుతున్న ప్రైవేటు ట్రావెల్ బస్సులో సోమవారం తెల్లవారుజామున ఆకస్మికంగా రేగిన మంటలతో బస్సు పూర్తిగా దగ్ధమవ్వగా డ్రైవర్ అప్రమత్తతో ప్రయాణికులంతా సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. గుంటూరుకు చెందిన గాయత్రి ట్రావెల్ బస్సు ఏపీ 36ఎక్స్ 3654 హైద్రాబాద్ నుండి ఒంగోలుకు 40 మంది ప్రయాణికులతో వెళుతోంది. నార్కట్‌పల్లి-నల్లగొండ మధ్యన చర్లపల్లి గ్రామం వద్ద బస్సు ఇంజన్‌లో ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. ఆ సమయం సోమవారం రాత్రి 1:30 సమయం కావడంతో బస్సులోని ప్రయాణికులంతా గాడ నిద్రలో ఉండగా డ్రైవర్ వారందరినీ అప్రమ్తతం చేయడంతో ఉరుకులు పరుగులతో బస్సు నుండి సురక్షితంగా కిందకు దిగేశారు. క్షణాల్లోనే మంటలు బస్సు మొత్తమంతా వ్యాపించి దగ్ధమైంది. దీంతో కొంతమంది ప్రయాణికుల లగేజీ మంటల్లోనే కాలిపోయింది. సమాచారం అందుకున్న నల్లగొండ అగ్నిమాపక విభాగం ఫైర్ ఇంజన్లు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అర్పేశారు. మంటల్లో అప్పటికే బస్సు పూర్తిగా దగ్ధం కావడంతో మంటల్లో తగలబడుతున్న బస్సును చూసి ప్రయాణికులు, పరిసర గ్రామ ప్రజలు, వాహనాదారులు భయాందోళనకు గురయ్యారు. బస్సులోని ప్రయాణికులంతా తాము క్షేమంగా బయటపడటంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈ సంఘటనపై నల్లగొండ రూరల్ ఎస్‌ఐ రాజశేఖర్‌రెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

*చిత్రం... చర్లపల్లి వద్ద దగ్ధమైన బస్సు