క్రైమ్/లీగల్
మద్యం మత్తులో కన్నతల్లిని చంపిన కసాయి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 3 December 2019
షాద్నగర్, డిసెంబర్ 2: మద్యం మత్తులో రోకలిబండతో మోది తల్లిని చంపిన తనయుడి ఉదంతం ఫరూక్నగర్ మండలం కంసాన్పల్లిలో వెలుగుచూసింది. ఆదివారం రాత్రి మద్యం తాగి వచ్చిన కుమారుడు బైండ్ల నర్సింలుని తల్లి వెంకటమ్మ(50) మందలించడంతో ఇంటి నుంచి బయడికి వెళ్లాడు. మళ్లీ మద్యం సేవించి వచ్చి నిద్రిస్తున్న తల్లిని రోకలి బండతో మోదడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. మృతురాలిని పోస్టుమార్టం నిమిత్తం షాద్నగర్ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఇన్స్పెక్టర్ శ్రీ్ధర్ కుమార్ తెలిపారు.