క్రైమ్/లీగల్

ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జంగారెడ్డిగూడెం: పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం రూరల్ మండలం పుట్లగట్లగూడెంలో ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారం జరిగింది. ఇంటర్మీడియట్ చదువుతున్న 16 ఏళ్ల బాలుడు ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు బాలుడిపై పోక్సో యాక్ట్ కింద ఆదివారం రాత్రి లక్కవరం ఎస్‌ఐ పరిమి రమేష్ కేసు నమోదు చేశారు. ఈ సంఘటన శనివారం రాత్రి జరిగినట్టు పోలీసులు తెలిపారు. బాలిక తల్లి ఇంటిలో లేని సమయంలో బాలిక ఒంటరిగా ఉండటంతో పక్కింటి బాలుడు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడని, బాలిక తల్లి ఫిర్యాదు మేరకు బాలికపై అత్యాచార యత్నం చేసినట్టు పేర్కొన్నారు. బాలిక జంగారెడ్డిగూడెంలోని ఒక ప్రైవేటు పాఠశాలలో ఒకటో తరగతి చదువుతుందని, బాలుడు జంగారెడ్డిగూడెంలోని ఒక ప్రైవేటు కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్నాడని తెలిపారు. తల్లి ఫిర్యాదు మేరకు సంఘటనా స్థలాన్ని స్థానిక డీఎస్పీ ఎం స్నేహిత, సీఐ బిఎన్ నాయక్ పరిశీలించారు. బాలికను వైద్య పరీక్షలకై స్థానిక ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి పంపించగా, మహిళా వైద్యురాలు లేని కారణంగా ఏలూరు జనరల్ ఆసుపత్రికి పంపినట్టు పోలీసులు తెలిపారు. బాలికకు వైద్య పరీక్షల అనంతరం అత్యాచారం జరిగిందీ లేనిదీ నిర్థారించడం జరుగుతుందని, అప్పటి వరకు అత్యాచార యత్నంగా భావించాల్సి ఉంటుందని చెప్పారు. ఈ కేసులో నిందితుడు అయిన బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఒకపక్క ప్రియాంకరెడ్డి సంఘటనతో రాష్ట్రంలో అలజడి రేగుతున్న తరుణంలో మండలంలో ఇటువంటి సంఘటన అటు ప్రజలను, ఇటు పోలీసు వర్గాలను ఉలికిపాటుకు గురి చేసింది. బాలుడిపై లక్కవరం పోలీస్ స్టేషన్‌లో 376ఎబి, 447ఐపిసి, 5(ఐ) (ఎం) రెడ్‌విత్ 6 పోక్సో యాక్ట్ 2012 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు లక్కవరం పోలీసులు తెలిపారు. డీఎస్పీ ఎం స్నేహిత కేసు దర్యాప్తు చేస్తున్నారు.