క్రైమ్/లీగల్

ప్రైవేట్ బస్సు బోల్తా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, డిసెంబర్ 1: బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న లిమో లైనర్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆదివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో అనంతపురం నగరంలోని తపోవనం వద్ద బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో ఒడిశా రాష్ట్రానికి చెందిన సుచిత్ర(26) అక్కడికక్కడే మృతి చెందగా మరో 9 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వివరాలు.. జాతీయ రహదారి-44పై తపోవనం వద్ద ఉన్న ఫ్లై ఓవర్ బ్రిడ్జి నుంచి దిగుతున్న సమయంలో డ్రైవర్ బస్సు వేగాన్ని నియంత్రించలేక పోవడంతో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు మూడవ పట్టణ ఎస్‌ఐ నాగమధు తెలిపారు. తపోవనం కూడలిలో స్పీడ్ బ్రేకర్లు ఉండటంతో బస్సు నియంత్రణ కాకపోవడంతో ఎడమ వైపు ఉన్న రెయిలింగ్‌ను ఢీకొట్టి పల్టీలు కొడుతూ కుడివైపునకు తిరిగి పడిపోయింది. ఆ సమయంలో బస్సులో గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులు ఈ ఘటనతో భయకంపితులై హాహాకారాలు పెట్టారు. స్థానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
*చిత్రం...అనంతపురంలో జాతీయ రహదారి-44పై బోల్తా పడిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు