క్రైమ్/లీగల్

ప్రణయ్ అమృతను బెదిరించిన ముగ్గురి అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిర్యాలగూడ టౌన్, నవంబర్ 30: నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్న యువకుడు ప్రణయ్ హత్య కేసులో అతని భార్యను బెదిరించిన కేసులో ముగ్గురిని అరెస్టు చేశారు. ప్రణయ్ భార్య అమృతను తమకు అనుకూలంగా వ్యవహరించాలని బెదిరించిన ఆమె తండ్రి టీ.మారుతిరావు, అతని అనుచరులు ఎంఎ.కరీం, కందుల వెంకటేశ్వర్లులను శనివారం నాడు అరెస్టు చేసినట్టు వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ సీహెచ్.సదానాగరాజు తెలిపారు. ఇటీవల కందుల వెంకటేశ్వర్లు ముత్తిరెడ్డికుంటలోని అమృత నివాసానికి వెళ్లి తమను ఆమె తండ్రి మారుతిరావు పంపించారని ఆస్తి మొత్తం అమృత పేరు మీద రాసి ఇస్తానని ప్రణయ్ హత్య కేసులో తమకు అనుకూలంగా ఉండాలని చెప్పడంతో అమృత వెంటనే పోలీసులకు ఫోన్ చేసి ఫిర్యాదు చేసింది. పోలీసులు వెంకటేశ్వర్లును అదుపులోకి తీసుకుని సమగ్ర విచారణ జరిపి సెక్షన్ 452, 506, 195ల కింద మారుతిరావు, కరీంలను కూడ అరెస్టు చేశారు. నిందితులు ముగ్గురినీ స్థానిక జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరు పర్చగా జ్యుడీషియల్ కస్టడీకి తరలించాలని ఆదేశించడంతో స్థానిక సబ్‌జైలుకు పంపారు.