క్రైమ్/లీగల్

దంపతుల దారుణ హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జిన్నారం, నవంబర్ 30: నిద్రిస్తున్న భార్యాభర్తలను అతి కిరాతకంగా నరికి చంపిన సంఘటన సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం, శివానగర్‌లో తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే... జిన్నారం మండలం, శివానగర్ గ్రామానికి చెందిన బ్యాథోల్ సుధాకర్ (36), భార్య విజయలక్ష్మీ (28) శుక్రవారం రాత్రి నిద్రిస్తున్నారు. గుర్తుతెలియని దుండగులు వారిని కత్తితో అతి దారుణంగా హత్య చేసి పరారయ్యారు. విషయం తెలుసుకున్న సంగారెడ్డి జిల్లా ఎస్‌పీ చంద్రశేఖర్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తమ సిబ్బందితో కలిసి క్లూస్ టీమ్‌ను రప్పించి విచారణను చేపట్టారు. మృతుని ఇంటి సమీపంలో ఉండే రాజు అనే వ్యక్తి హత్యలకు కారణమై ఉంటాడని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. భార్యాభర్తల హత్యతో వారికి జన్మించిన నవనీత (ఏడాదిన్నర సంవత్సరం) ఒంటరైంది. మృతదేహాల మధ్య రోదిస్తున్న చిన్నారి పాపను చూసి పలువురు కన్నీటి పర్యంతమయ్యారు. చిన్నారి రోదన ప్రతిఒక్కరి మనసులను కలచివేసింది. భార్యాభర్తలు ఇద్దరికీ రెండో పెళ్లి కావడం గ్రామంలో గతంలో మృతుడికి అక్రమ సంబంధంతో జరిగిన గొడవ ఘటనలను దృష్టిలో పెట్టుకుని జిన్నారం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

*చిత్రాలు.. రక్తపు మడుగులో భార్యాభర్తల మృతదేహాలు
*హత్యకు గురైన సుధాకర్, విజయ లక్ష్మీ ఫైల్ ఫొటో