క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్, నవంబర్ 26: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన సంఘటన షాద్‌నగర్ పట్టణ సమీపంలో చోటు చేసుకుంది. మంగళవారం తెల్లవారు ఝామున పటణ సమీపంలోని పాత జాతీయ రహదారిపై ఎదురెదురుగా రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందినట్లు షాద్‌నగర్ పోలీసులు తెలిపారు. వికారాబాద్ జిల్లా కుల్కచెర్ల మండలం కుసుమ సముద్రం గ్రామానికి చెందిన పాల్త్యా రాహుల్ (32), వెంకట్‌రెడ్డిపల్లి గ్రామానికి చెందిన శివలింగం (30) అనే ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనాలపై వస్తూ ఎదురెదురుగా ఢీకొనడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని రెండు మృతదేహాలను షాద్‌నగర్ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టౌన్ సీఐ శ్రీదర్‌కుమార్ తెలిపారు.