క్రైమ్/లీగల్

దోచుకున్నారు.. తోసేశారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంతకల్లు : నాందేడ్ ఎక్స్‌ప్రెస్ రైలులో ఓ ప్రయాణికుడి వద్ద గుర్తు తెలియని వ్యక్తులు రూ. 50 వేల నగదు దోచుకుని ఆ తర్వాత కిందకు తోసేసిన సంఘటన ఆదివారం అనంతపురం జిల్లా గుంతకల్లు రైల్వే డివిజన్ పరిధిలోని తిమ్మనచెర్ల రైల్వేస్టేషన్‌లో చోటు చేసుకుంది. జీఆర్‌పీ పోలీసులు, బాధితుడు తెలిపిన వివరాలు.. బెంగళూరులో హోటల్‌లో పని చేస్తూ జీవనం సాగిస్తున్న గోవిందుశెట్టి శనివారం రాత్రి బెంగళూరు నుంచి మంత్రాలయానికి నాంధేడ్ ఎక్స్‌ప్రెస్ రైలులో బయల్దేరాడు. జనరల్ కోచ్‌లో ప్రయాణిస్తున్న గోవిందుశెట్టితో నలుగురు తోటి ప్రయాణికులు మాటలు కలిపి అతడి వద్ద నగదు వున్నట్లు పసిగట్టారు. రైలు తెల్లవారుజామున గుంతకల్లు స్టేషన్‌కు అతి సమీపంలో ఉన్న తిమ్మనచెర్ల రైల్వేస్టేషన్ వద్ద వెళ్తుండగా గోవిందుశెట్టి బాత్‌రూమ్‌కు వెళ్లగా దుండగులు అతడి జేబులో వున్న రూ. 10 వేలతో పాటు బ్యాగులో భద్రపరచిన రూ. 40 వేలు లాక్కుని ఆ తర్వాత అతడిని రైలు నుంచి తోసేశారు. ఈ సంఘటనలో గోవిందుశెట్టి తీవ్రంగా గాయపడడంతో అపస్మారకస్థితిలో పడిపోయాడు. ఉదయం అటుగా వాకింగ్‌కు వచ్చిన స్థానికులు అతడిని గమనించి సమాచారం ఇవ్వడంతో 108 సిబ్బంది వచ్చి గుంతకల్లు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు జీఆర్‌పీ పోలీసులు తెలిపారు.