క్రైమ్/లీగల్

పెళ్లికి వెళ్లి వస్తూ జల సమాధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నడిగూడెం, అక్టోబర్ 18: పెళ్లి వేడుకలకు వెళ్లి వస్తుండగా జరిగిన ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం చాకిరాల గ్రామం శివారులోని నాగార్జున సాగర్ ఎడమకాలువలోకి శుక్రవారం రాత్రి 8 గంటల సమయంలో స్కార్పియో వాహనం దూసుకెళ్లి నీట మునగడంతో అందులో ప్రయాణిస్తున్న ఆరుగురు దుర్మరణం చెందారు. హైద్రాబాద్ అంకూర్ ఆసుపత్రికి చెందిన సిబ్బంది తమ మిత్రుడు విమలకొండ మహేష్ పెళ్లికి చాకిరాలకు వచ్చి తిరిగి వెళుతున్న క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వర్షం పడుతుండటం, చీకటి సమయం కావడంతో డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి దారిని సరిగా గుర్తించలేక అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లినట్టు భావిస్తున్నారు. సంఘటనా స్థలాన్ని మునగాల సీఐ శివశంకర్‌గౌడ్, నడిగూడెం ఎస్‌ఐ నరేష్ సందర్శించి క్రేన్‌ను రప్పించి కాలువ నుండి స్కార్పియో వాహనాన్ని, మృతదేహాలను బయటకు తీసుకొచ్చే చర్యలను చేపట్టారు. ఈ ప్రమాదంలో అంకూర్ ఆసుపత్రి సిబ్బంది అబ్దుల్ అజీజ్ (45), రాజేష్ (29), సంతోష్‌కుమార్ (35), జాన్‌షాన్ (36), నగేష్ (35), పవన్‌కుమార్ (23) దుర్మరణం చెందినట్టు పోలీసులు వెల్లడించారు. ఈ ప్రమాదంపై నడిగూడెం ఎస్‌ఐ నరేష్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.