క్రైమ్/లీగల్

గుండెపోటుతో ఆర్టీసీ డ్రైవర్ మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మర్రిగూడ, అక్టోబర్ 11: మండల కేంద్రంలోని ఎరుకల లక్ష్మణ్ తండ్రి నారయ్య శుక్రవారం ఉదయం గుండెపోటుతో హైద్రాబాద్‌లోని అపోలో డీఆర్ డీవోలో మృతి చెందాడు. ఇతనికి మద్దతుగా అఖిలపక్ష నాయకులు మర్రిగూడ బస్టాండ్ నుండి మృతుని ఇంటి వరకు ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మెండు మోహన్‌రెడ్డి మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె దృష్టియా ముఖ్యమంత్రిగారు చేసిన ప్రకటనతో ఉద్యోగం ఉంటదో ఉడుతదో అని బాధపడుతూ గుండెపోటుతో మృతి చెందడం జరిగిందని ఈ మరణానికి ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలని ఆర్టీసీని వెంటనే ప్రభుత్వంలో విలీనం చేయాలని మృతిని కుటుంబానికి 25లక్షల నష్ట పరిహారం చెల్లించాలని ఆయన కోరారు. ఇట్టి నిరసన కార్యక్రమంలో ఎంపీపీ మెండు మోహన్‌రెడ్డి, ఆర్టీసీ జేఏసీ నాయకులు మహ్మద్‌మోసిన్, యాదయ్య, వెంకటయ్య, రహీమ్, భిక్షమయ్య, కట్టయ్య, జంగయ్య, యాదయ్య, రామలింగం, సైదులు, రవి, పెద్దయ్య, శ్రీను, అఖిలపక్ష నాయకులు పాల్గొన్నారు.