క్రైమ్/లీగల్

ఆటో, బైక్ ఢీ: ముగ్గురు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విఆర్‌పురం, సెప్టెంబర్: తూర్పు గోదావరి జిల్లా వీఆర్‌పురం మండలం మొద్దులగూడెం జంక్షన్ సమీపంలో సోమవారం ఆటో, బైక్ ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరొకరికి స్వల్ప గాయాలయ్యాయి. వివరాలిలావున్నాయి... ముత్యాల వెంకన్నబాబు (55), బాగుల సాయిబాబు (40) సోమవారం బైక్‌పై వీఆర్‌పురం నుండి పోచవరం వెళుతున్నారు. మొద్దులగూడెం జంక్షన్ దాటాక మలుపులో రాయిగూడెం నుండి ప్రయాణీకులతో సంతకు వెళుతున్న ఆటో, బైక్ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళుతున్న వెంకన్నబాబు, సాయిబాబు, ఆటోలో ప్రయాణిస్తున్న వల్ల సంజీవరెడ్డి (26) తీవ్రంగా గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం రేఖపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం వారిని మెరుగైన వైద్యం కోసం భద్రాచలం ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో వెంకన్నబాబు, సాయిబాబు మృతిచెందారు. సంజీవరెడ్డి భద్రాచలం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఆటోలో ప్రయాణిస్తున్న ఒక యువతికి స్వల్ప గాయాలయ్యాయి.