క్రైమ్/లీగల్

అర్ధరాత్రి వ్యక్తి దారుణ హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), సెప్టెంబర్ 21: సూర్యారావుపేట పోలీస్టేషన్ పరిధిలో అర్ధరాత్రి ఓ వ్యక్తి దారుణ హత్యకు గు రయ్యాడు. మద్యం మత్తులో తలెత్తిన ఘర్షణ హత్యకు దారి తీసినట్లు భావిస్తున్నారు. కాగా ఘటనకు సంబంధిం చి ప్రాథమిక ఆధారాల కోసం దర్యాప్తు అధికారులు అనే్వషిస్తున్నారు. పోలీసు లు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. అరండల్ పేట సంజీవయ్య కాలనీకి చెందిన మలిశెట్టి మనోజ్‌కుమార్ (27) కు తల్లిదండ్రులు లేరు. ఇక్కడే బంధువులు ఉన్నప్పటికీ వారితో మనోజ్‌కు పెద్దగా సంబంధాలు లేవు. మద్యం, ఇతర వ్యసనాలకు బానిసైన మనోజ్‌కుమార్ పరిసర ప్రాంతాల్లో ఫ్లెక్లీలు కట్టే పనికి వెళ్తూ వచ్చిన కొద్దిపాటి డబ్బుతో తాగి జల్సా చేస్తుంటాడని పోలీసులు తెలిపారు. ఈక్రమంలో శనివారం తెల్లవారుజామున సుమారు రెండు, రెండున్నర గంటల మధ్యలో పోలీసులకు వ చ్చిన సమాచారం మేరకు సంజీవయ్య కాలనీకి వెళ్లి చూడగా రోడ్డుపై విగతజీవిగా ఉండటాన్ని గుర్తించారు. అగంతకులు బండరాయితో తలపై మోది చంపినట్లు అనుమానిస్తున్నారు. అంతకుముందు శుక్రవారం రాత్రి హతుడు మరికొంతమంది కలిసి సమీపంలోని ఓ మద్యం షాపుకెళ్లి పూటుగా మద్యం సేవించి ఉంటారని, మత్తులో వారి మ ధ్య జరిగిన గొడవను పురస్కరించుకు ని స్నేహితులు అతని తలపై రాయితో కొట్టి చంపి ఉంటారని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని ఘటనాస్థలం నుంచి ప్రభుత్వాస్పత్రి మార్చురీకి తరలించి శనివారం ఉదయం పోస్టుమా ర్టం నిర్వహించి సమీప బంధువులకు అప్పగించారు. హత్యానేరం కింద కేసు నమోదు చేసి సూర్యారావుపేట సీఐ సూర్యనారాయణ దర్యాప్తు చేపట్టారు. బార్ వద్ద సీసీ కెమెరా పుటేజీలు, సెల్‌ఫోన్, ఇతర ప్రాథమిక సాక్ష్యాల ఆధారంగా నిందితులను గుర్తించేపనిలో ఉన్నారు. పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నామని, త్వరలోనే నిందితులను గుర్తించి అరెస్టు చేస్తామని సీఐ తెలిపారు.