క్రైమ్/లీగల్
కంటెయినర్ను ఢీకొన్న లారీ ముగ్గురు దుర్మరణం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
మంగళగిరి, సెప్టెంబర్ 13: 16వ నెంబర్ జాతీయ రహదారిపై గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరు గ్రామ పరిధిలో హ్యాపీ రిసార్ట్స్ సమీపాన శుక్రవారం తెల్లవారుజామున ఆగి ఉన్న కంటెయినర్ను వెనుక నుంచి లారీ ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడి కక్కడే మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల కథనం ప్రకారం జాతీయ రహదారిపై రోడ్డు మార్జిన్లో ఆగి ఉన్న కంటెయినర్ను శ్రీకాకుళం నుంచి గుంటూరు గొర్రెలమండీకి వెళుతున్న లారీ వెనుక నుంచి ఢీకొంది. లారీ డ్రైవర్ కోటిపల్లి శాంతారావు(40), కాబిన్లో ప్రయాణిస్తున్న బీ కన్నయ్య (35), సూరిబాబు (40) తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడగా చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన డ్రైవర్ శాంతారావు, కన్నయ్య శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట ప్రాంతానికి చెందినవారు కాగా సూరిబాబు తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. మృత దేహాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మంగళగిరి రూరల్ సీఐ శేషగిరిరావు తెలిపారు.